కన్నడ నాట మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోందని, ఈ సమావేశంలో ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి దించేసి… చాన్నాళ్లుగా ఆ పదవి కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు అప్పగించే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటూ ఆ వార్తలు చెబుతున్నాయి.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో పార్టీలో కీలక నేతగా ఎదిగిన డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారని, ఈ కారణంగానే పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో విజయం సాధించిందని నాడు కాంగ్రెస్ భావించింది. అయితే అప్పటికే సీఎంగా కొనసాగుతున్న సిద్ధరామయ్య…మరోమారు తానే సీఎంగా ఉంటానని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగేలా ఓ ఒప్పందం జరిగిందని వార్తలు వినిపించాయి.
2023 ఎన్నికల్లో విజయం తర్వాత మరోమారు సీఎంగా అవకాశం దక్కించుకున్న సిద్ధరామయ్య ఇప్పటికే తన రెండున్నరేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యను దించేసి సీఎం పీఠాన్ని తనకు అప్పగించాలని డీకే పలుమార్లు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించలేకపోయింది. ఆ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు డీకే మరోమారు అధిష్ఠానానికి ఈ విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం. దీనిపై మరింత సాగదీత తగదన్న రీతిలో అధిష్ఠానం చర్యలు చేపట్టిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
తక్షణమే ఢిల్లీ రావాలంటూ సిద్ధరామయ్యకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి సందేశం వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధరామయ్యే వెల్లడించారు. అయితే విషయం ఏమిటన్న దానిని సిద్ధరామయ్య వెల్లడించలేదు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సిద్ధరామయ్య…మంగళవారం ఉదయం 11 గంటలకు కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు.
ఈ భేటీలోనే సీఎం మార్పు దిశగా కీలక చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. రెండున్నరేళ్లకు బదులుగా మూడేళ్ల పాటు సీఎంగా ఉన్నారు కదా… ఇక డీకేకు అవకాశం కల్పిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం సిద్ధరామయ్యను కోరనున్నట్టు సమాచారం. మరి ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఏమంటారో… సిద్ధరామయ్య స్పందనపై అదిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో…
ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న సమయంలో కీలక అధికారి, మాజీ ఐఏఎస్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ…
మొజ్తబా ఖమేనీ. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్. కానీ.. పేరుకే ఇది పరిమితం అయింది. ఆయన బయటకు వచ్చేందుకు.. ప్రజలకు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ మళ్లీ అలిగారా? కీలకమైన మంత్రి వర్గ సమావేశానికి…
ఒకవైపు రాష్ట్రంలో సొమ్ములు లేవని.. ఎవరూ డబ్బులు డిమాండ్ చేయద్దని సాక్షత్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్…
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వచ్చిన 'రావు బహదూర్' ఒక సైకలాజికల్ డ్రామా. సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన…