ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెర తీసింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసిన సందర్భంగా జగన్ అరెస్టుపై చర్చ జరిగిందని నాగేశ్వర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో నాగేశ్వర్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లబిస్తుండగా… కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. నాగేశ్వర్ అవినీతి పాల్పడ్డారంటూ మల్లన్న ఆరోపించారు.
పవన్ చెప్పినట్లుగా జగన్ అరెస్టుకు అమిత్ షా ససేమిరా అన్నారని నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు తనకు పార్ట్ టైం మిత్రుడని, జగన్ దీర్ఘకాల మిత్రుడని కూడా అమిత్ షా పేర్కొన్నట్లుగా నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై జనసేన భగ్గుమనగా… నాగేశ్వర్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.
వ్యాఖ్యల ఉపసంహరణ తర్వాత ఆయనపై ఏపీలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ కు మద్దతు అమాంతంగా పెరుగుతుండగా… కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు.
సోమవారం నాటి పత్రికల్లో 10టీవీ షేర్ల బదిలీ గురించిన ఓ వార్త రాగా… అందులో మతలబు జరిగిందని సదరు వార్త చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై తాను ఓ రోజు ముందుగానే ఆరోపణలు చేశానని మల్లన్న గుర్తు చేశారు.
తన ఆరోపణలు చూసిన నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేస్తానని వేరే వ్యక్తుల వద్ద అన్నారని కూడా మల్లన్న గుర్తు చేసుకున్నారు. దమ్ముంటే నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేయాలని, వేస్తే ఏమవుతుంది? ఇంకో కేసు పెరుగుతుందని ఆయన సెటైర్లు సంధించారు.
10 టీవీ షేర్ల బదిలీ విషయాన్ని పక్కనపెడితే… 10 టీవీ పేరు మీద నాగేశ్వర్ పేదోళ్ల పైసలు తిన్నారని మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ దీనిపై విచారణ జరిగితే… ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తాను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
10 టీవీ పేరు మీద పేదోళ్లు, కార్మికుల పైసలను నాగేశ్వర్ తిన్న వ్యవహారానికి సంబంధించి తాను నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని చెప్పిన మల్లన్న.. దమ్ముంటే నాగేశ్వర్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. వెరసి నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు మరింత రసకందాయంలో పడిందని చెప్పక తప్పదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…