ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెర తీసింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసిన సందర్భంగా జగన్ అరెస్టుపై చర్చ జరిగిందని నాగేశ్వర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో నాగేశ్వర్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లబిస్తుండగా… కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. నాగేశ్వర్ అవినీతి పాల్పడ్డారంటూ మల్లన్న ఆరోపించారు.
పవన్ చెప్పినట్లుగా జగన్ అరెస్టుకు అమిత్ షా ససేమిరా అన్నారని నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు తనకు పార్ట్ టైం మిత్రుడని, జగన్ దీర్ఘకాల మిత్రుడని కూడా అమిత్ షా పేర్కొన్నట్లుగా నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై జనసేన భగ్గుమనగా… నాగేశ్వర్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.
వ్యాఖ్యల ఉపసంహరణ తర్వాత ఆయనపై ఏపీలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ కు మద్దతు అమాంతంగా పెరుగుతుండగా… కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు.
సోమవారం నాటి పత్రికల్లో 10టీవీ షేర్ల బదిలీ గురించిన ఓ వార్త రాగా… అందులో మతలబు జరిగిందని సదరు వార్త చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై తాను ఓ రోజు ముందుగానే ఆరోపణలు చేశానని మల్లన్న గుర్తు చేశారు.
తన ఆరోపణలు చూసిన నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేస్తానని వేరే వ్యక్తుల వద్ద అన్నారని కూడా మల్లన్న గుర్తు చేసుకున్నారు. దమ్ముంటే నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేయాలని, వేస్తే ఏమవుతుంది? ఇంకో కేసు పెరుగుతుందని ఆయన సెటైర్లు సంధించారు.
10 టీవీ షేర్ల బదిలీ విషయాన్ని పక్కనపెడితే… 10 టీవీ పేరు మీద నాగేశ్వర్ పేదోళ్ల పైసలు తిన్నారని మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ దీనిపై విచారణ జరిగితే… ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తాను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
10 టీవీ పేరు మీద పేదోళ్లు, కార్మికుల పైసలను నాగేశ్వర్ తిన్న వ్యవహారానికి సంబంధించి తాను నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని చెప్పిన మల్లన్న.. దమ్ముంటే నాగేశ్వర్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. వెరసి నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు మరింత రసకందాయంలో పడిందని చెప్పక తప్పదు.
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…