Political News

అదిరేలా గోదావ‌రి పుష్క‌రం… ఏకంగా వెయ్యి కోట్లు!

వ‌చ్చే ఏడాది జూలైలో ప్రారంభ‌మ‌య్యే గోదావ‌రి పుష్క‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ పుష్క‌రాల‌ను క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. దీనికిగాను.. ఏకంగా 1000 కోట్ల‌ రూపాయ‌ల‌ను కేటాయించాల‌ని తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనికి మంత్రులు ఆమోదం తెలిపారు. అంతేకాదు.. ఏర్పాట్లు కూడా త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో త‌క్ష‌ణం 300 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ పుష్క‌రాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టుసీఎం చెప్పారు.

మ‌న ప్ర‌భుత్వంలో వ‌చ్చిన తొలి పుష్క‌రాలు ఇవే. ఈ పుష్క‌రాలు.. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గాలి. ఎక్క‌డా ఏ లోటూ రాకుండా చూసుకుందాం. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో పుష్క‌రాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు.. నిర్వ‌హ‌ణ‌ను సమ‌న్వ‌యం చేసుకునేందుకు మంత్రుల‌తో కూడిన 4 క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై క‌స‌ర‌త్తు చేసే బాధ్య‌త‌ను మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు అప్ప‌గించారు. పుష్క‌రాల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు పెట్ట‌డంతోపాటు.. భ‌క్తుల‌కు న‌దీ తీరం వెంబ‌డి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయ‌డం వంటివి కీల‌కంగా ఉండాల‌న్నారు.

కాగా.. గోదావ‌రి పుష్క‌రాలు మూడు రాష్ట్రాల్లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, ఏపీల‌లో గోదావ‌రి కీల‌క న‌ది కావ‌డంతో ఆయా ప్ర‌భుత్వాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం పాఠ‌శాల‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితమైన మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని జూనియ‌ర్ కళా శాల‌ల‌కు కూడా విస్త‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. దీనిపై కూడా మంత్రుల‌తో చ‌ర్చించారు.

డ్రాపౌట్లు ఎక్కువ‌గా పెరుగుతున్న‌ది 10వ త‌ర‌గ‌తి త‌ర్వాతేన‌ని.. దీనిని నివారించేందుకు కళాశాల‌ల్లో నూ మ‌ధ్యాహ్న భోజ‌నం ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. దీనికి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. ఏడాదికి 150 నుంచి 200 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు.

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కేంద్ర భ‌ద్ర‌తా ద‌ళాల‌కు సంబంధించిన శిక్ష‌ణ కేంద్రాల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ల‌పై కూడా మంత్రి వ‌ర్గం చ‌ర్చించింది. అస్సాం రైఫిల్స్ స‌హా.. ప‌లు కేంద్ర ర‌క్ష‌ణ రంగ సంస్థ‌ల ఏర్పాటుకు భూములు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.

This post was last modified on May 24, 2026 6:12 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago