Political News

జగన్ మంచోడు కాబట్టే వాళ్లు బ్రతికున్నారు

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కొంతకాలంగా కూటమి పార్టీల నేతలు ట్రోలింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు కామెంట్ చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే వైసీపీ నేతలను యాక్స్ గ్యాంగ్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆ కామెంట్లపై స్పందించారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అంటూ జగన్ ప్రశ్నించారు.

‘‘జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఇంకా ప్రశాంతంగా తిరుగుతున్నారు…జగన్ నైజం ఎలాంటిది అనేదానికి అదే నిదర్శనం…వారంతా ఇంకా బతికే ఉన్నారు…వారికి ఎప్పటికీ ఏమీ కాదు…నేను చెడ్డోడిని అయితే మా తాతను దారునంగా నరికి చంపిన వాళ్లు ఇప్పుడు ప్రశాంతంగా తిరిగేవారా అని ప్రశ్నించారు.

చంద్రబాబులా హత్యా రాజకీయాలు చేయడం నాకు తెలియదు….ప్రజలకు మంచి చేసి మంచిపేరు సంపాదించాలని నాన్న రాజశేఖర్ రెడ్డి నేర్పించారు..’’అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

తన కుటుంబం తన తాత, తండ్రి, చిన్నాన్న..ముగ్గురిని కోల్పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డళ్లు, గునపాలు ఎవరికి అవసరమో ప్రజలందరికీ తెలుసని అన్నారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. రెండేళ్లలో ఎంతోమంది వైసీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on May 21, 2026 9:04 pm

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంత్రుప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

26 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

2 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

7 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

10 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

10 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago