మెగా పవర్ స్టార్ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా.. ఆర్ఆర్ఆర్. అందులో సీతారామరాజు పాత్రలో చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రామ్ పాత్రకు, అందులో చరణ్ నటనకు అబ్బురపడ్డాడు. బాలీవుడ్లో నటించిన ‘జంజీర్’ సినిమాతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చరణ్.. ఈ చిత్రంతో అక్కడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.
అలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా విషయంలో చరణ్ ఒక దశలో పూర్తిగా మోటివేషన్ కోల్పోయాడట. అందుకు కారణం కొవిడ్ అని.. ఆ వైరస్ కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో తాను ప్రేరణ కోల్పోయి, మళ్లీ పని చేయడానికి సిద్ధంగా లేని స్థితికి చేరుకున్నానని చరణ్ గుర్తు చేసుకున్నాడు. ఆ టైంలో దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సలహా తనలో మార్పు తెచ్చినట్లు అతను వెల్లడించాడు.
కొవిడ్ వల్ల లాక్ డౌన్ విధించడంతో ఏమీ పాలుపోని స్థితికి తాను చేరుకున్నానని.. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్ లాక్ డౌన్ తీసేయబోతున్నారని తెలిసినా, మళ్లీ షూటింగ్కు వెళ్లాలన్న ఉత్సాహం తనలో కలగలేదని చరణ్ తెలిపాడు. ఇదే విషయాన్ని రాజమౌళికి తాను చెబితే.. ఆయన చాలా మంచి సలహా ఇచ్చాడని చరణ్ గుర్తు చేసుకున్నాడు.
మోటివేషన్ కోసం పెద్ద పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదని.. రోజుకు ఒక టాస్క్ లాంటిది పెట్టుకోమని, అది తన బెడ్రూంను శుభ్రం చేసుకోవడం కావచ్చు లేదంటే బాల్కనీని బాగు చేసుకోవడం కావచ్చు.. లేదా ఫామ్ హౌస్ను ది బెస్ట్గా తీర్చిదిద్దుకోవడం కావచ్చు.. ఇలా ఏదో ఒక టాస్క్ పెట్టుకుని దాని కోసం పని చేయమని, ప్రేరణ దానంతట అదే వస్తుందని రాజమౌళి సూచించినట్లు చరణ్ తెలిపాడు.
తాను రాజమౌళి సలహాను పాటించగా, అది అద్భుతంగా పని చేసిందని.. తర్వాత మూణ్నాలుగేళ్లలో తనకు ఏ రోజూ మోటివేషన్ లేని పరిస్థితి ఎదురు కాలేదని చరణ్ తెలిపాడు. ‘పెద్ది’ సినిమాలో హీరో పాత్ర కూడా అంతేనని.. అతడికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగడని, ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడని.. ఉన్న వనరులను వాడుకుంటూ ముందుకు వెళ్లిపోతాడని.. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి చేసిన కారు ఇంటర్వ్యూలో చరణ్ వెల్లడించాడు.
This post was last modified on May 21, 2026 6:56 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…