బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి. అంతేనా.. వారికి ఘన స్వాగతాలు, మర్యాదలకు లోటు కూడా ఉండదు. గతంలో రాజస్థాన్(బీజేపీ పాలిత రాష్ట్రం)లో రేప్ కేసులో దోషులుగా తేలిన వారు జైలు నుంచి బయటకు వస్తే.. వారికి బీజేపీ నాయకులే.. పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇది అప్పట్లో పెను దుమారం రేపింది. ఇక, ఉన్నావ్ కేసులో నిందితుడికి కూడా బీజేపీ నాయకులు బెయిల్ ఇప్పించి.. బయటకు వచ్చాక ఊరేగింపుగా ఇంటికితీసుకువెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి ఘటనే తాజాగా బీజేపీ పాలితరాష్ట్రం, నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే ముఖ్యమంత్రిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో జరిగింది. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ల అనుబంధ విభాగం.. హిందూ యువ వాహిని మాజీ సభ్యుడు సుశీల్ ప్రజాపతికి ఆ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
రెండు చేతులతో ఎత్తుకుని ఊరేగిస్తూ.. ఆయనను జైలు నుంచి తీసుకువచ్చారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోనీ.. ఈయనేమన్నా.. సామాజిక సేవ చేసి జైలు కు వెళ్లి ఉంటే ఇలా చేయడం తప్పుకాదు. కానీ, ఆయన పక్కాగా ఓ యువతిపై అత్యాచారం చేసినట్టు పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.
ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. తన రూంకు పిలుచుకున్న ప్రజాపతి.. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి ప్రజాపతిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అయితే.. 9 మాసాల కిందటే కోర్టు అతనిపై ఉన్న నేరాభియోగాలు తీవ్రంగా ఉన్నాయంటూ.. బెయిల్ నిరాకరించి.. జైలుకు పంపించింది.
చివరకు తాజాగా మంగళవారం స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో హిందూవాహిని కార్యకర్తలు.. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ.. జైలు నుంచి ఊరేగింపుగా ప్రజాపతిని బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది.
దీనికి భిన్నంగా..
మరోవైపు అదే బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో మాత్రం తమ వాడుకానందున.. ఓ ముస్లిం మైనారిటీ వ్యక్తికి చెందిన భవనాన్ని కూల్చి వేశారు. పోనీ.. ఆయనేమన్నా రేప్ చేశాడా? చేయించాడా? అలాంటి కేసుల్లో ఏమైనా చిక్కుకున్నాడా? అంటే అది కూడా లేదు.
టీసీఎస్ లైంగిక వేధింపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళకు ఆశ్రయం ఇచ్చాడు. దీంతో సదరు భవనాన్ని నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్.. రాత్రికి రాత్రి కూల్చి వేసింది. అదే హిందు వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటే.. కాపాడేవారన్న చర్చ రెండు రోజుల నుంచి మీడియాలో జరుగుతున్న విషయం తెలిసిందే.
This post was last modified on May 19, 2026 9:48 pm
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…