దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ మీద ఉన్నాయి. ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు నిమిషాల గ్లిమ్ప్స్ ని కానుకగా ఇస్తామని ముందే ప్రకటించడంతో ఫ్యాన్స్ అర్ధరాత్రి కోసం ఆతృతగా ఎదురు చూశారు. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉన్న ఈ సినిమా మీద ప్రకటన స్టేజి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఆఫ్గనిస్తాన్, బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భారతదేశం కేంద్రంగా ఓపియుమ్ అనే ప్రమాదకర డ్రగ్ వ్యాపారం జడలు విప్పుతుంది. బ్రిటిషర్లు వదిలేసి వెళ్ళిపోయిన చోట మాఫియా పురుడు పోసుకుని ఒక పెద్ద సామ్రాజ్యంగా రూపాంతరం చెందుతుంది. అందులో నుంచి పుట్టుకొస్తాడు లూగర్ (జూనియర్ ఎన్టీఆర్). శత్రువులను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్న ఈ రాక్షసుడిని పట్టుకోవడానికి ప్రభుత్వం కదులుతుంది. ఆ తర్వాత ఏమయ్యిందో తెరమీద చూడాలి.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి డార్క్ వరల్డ్ ని ఎంచుకున్నాడు. ఈసారి కెజిఎఫ్ కంటే వెనక్కు వెళ్లి 1967లో ప్రపంచ దేశాలను కుదిపేసిన ఓపియం డ్రగ్ బిజినెస్ ని తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మరింత సన్నబడిన లుక్ లో చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు . శత్రువులను ఉద్దేశించి చెప్పే డైలాగు మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అనిల్ కపూర్, అశుతోష్ రానా తదితర పాత్రలను రుక్మిణి వసంత్ ద్వారా పరిచయం చేసిన విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంది.
మొత్తానికి అంచనాలు రేపడంలో డ్రాగన్ తొలి అడుగు దిగ్విజయంగా పూర్తయ్యింది. ఇంకా షూటింగ్ చాలా ఉంది కాబట్టి కంటెంట్ గురించి ఎక్కువ ఆశించలేం కానీ ఉన్నంతలో నీల్ తన టేకింగ్ ఎలా ఉంటుందో సలార్ ని మించే స్థాయిలో చూపించారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ఆయన స్టైల్ లో డెప్త్ గా సాగింది. తారక్ కనిపించేది కాసేపే అయినా డ్రాగన్ తాలూకు ముద్ర ఈ వీడియోలో బలంగా పడిపోయింది. సినిమా రిలీజ్ కు ఇంకో ఏడాది వెయిట్ చేయాల్సిందే
we
This post was last modified on May 20, 2026 12:13 am
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…