Political News

కాపుల‌ను త‌ట‌స్థం చేయ‌డ‌మే వైసీపీ ల‌క్ష్య‌మా?

కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌ట‌స్థం చేయాల‌న్న దిశ‌గా వైసీపీ అడుగులు వేగంగా ప‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కాపులు.. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారు. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధాంతాలు న‌చ్చిన వారు కొంద‌రు.. పార్టీలో ఉండాల‌ని.. త‌మకంటూ ఓ వేదిక ఉంద‌ని అభిప్రాయ‌ప‌డే వారు కొంద‌రు. ఇలా.. మొత్తంగా కాపులు.. జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారు.

అయితే.. ఇలా వారంతా ఐక్యంగా ఉంటే.. వైసీపీకి ఎదురు దెబ్బ మ‌రోసారి త‌ప్ప‌ద‌న్న భావ‌న ఉంది. ఈ క్ర‌మంలోనే అస‌లు కూట‌మిలోనే విభేదాలు క‌ల్పించ‌డం ద్వారా.. కూట‌మి విచ్ఛిన్నం చేసే దిశ‌గా కూడా.. ఇటీవ‌లి వ‌ర‌కు వైసీపీ నాయకులు ఇటు సోష‌ల్ మీడియాలోను.. అటు బ‌హిరంగ వేదిక‌ల‌పై కూడా.. చ‌ర్చకు దారి తీశారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై పార్టీ అధినేత‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల మ‌రోసారి కూట‌మి ప్రాధాన్యాన్ని తేల్చి చెప్పారు. ఎవ‌రు ఉన్నా.. లేకున్నా.. కూట‌మి కొన‌సాగుతుంద‌న్నారు.

దీంతో ఇప్పుడు కాపుల‌ను త‌ట‌స్థం చేసేందుకు.. అంటే.. వారు జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉండ‌కుండా చేయాల‌న్న వ్యూహాల‌ను తెర‌మీదికి తెచ్చిన‌ట్టు తెలిసింది. దీనిలో భాగంగా మ‌రోసారి.. కాపు ఉద్య‌మం దిశ‌గా అడుగులు వేసేందుకు కీల‌క నాయ‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు స‌మాచారం. 2014-19 మ‌ధ్య కాపులు త‌మ‌కు రిజ‌ర్వేష‌న్ స‌హా.. ఇత‌ర డిమాండ్ల‌పై ఉద్య‌మించారు. కానీ, వైసీపీ రావ‌డంతో వారంతా మౌనంగా ఉండిపోయారు.

ఇప్పుడు మ‌రోసారి ఈ ఉద్య‌మం ప్రారంభించేలా క్షేత్ర‌స్థాయిలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌కు వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. త‌ద్వారా ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వంపై కాపుల ఉద్య‌మాన్ని ప్రేరేపించే దిశ‌గా అడుగులు వేయాల‌న్న‌ది వైసీపీ వ్యూహంగా ఉంది. నిజానికి కాపులు ప్ర‌స్తుతం ఉద్య‌మాలు మానేశారు. త‌మ‌కు ప‌వ‌న్ ఉన్నాడ‌న్న భ‌రోసా ఉంది. కానీ, ఇదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారి.. వారిలో అనైక్య‌త‌ను పెంచి.. త‌ట‌స్థం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం.

This post was last modified on May 20, 2026 10:49 am

Share

Recent Posts

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

54 minutes ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

6 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

9 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

9 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

9 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

11 hours ago