కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం కాపులు.. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. జనసేనకు అనుకూలంగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చిన వారు కొందరు.. పార్టీలో ఉండాలని.. తమకంటూ ఓ వేదిక ఉందని అభిప్రాయపడే వారు కొందరు. ఇలా.. మొత్తంగా కాపులు.. జనసేనకు అనుకూలంగా ఉన్నారు.
అయితే.. ఇలా వారంతా ఐక్యంగా ఉంటే.. వైసీపీకి ఎదురు దెబ్బ మరోసారి తప్పదన్న భావన ఉంది. ఈ క్రమంలోనే అసలు కూటమిలోనే విభేదాలు కల్పించడం ద్వారా.. కూటమి విచ్ఛిన్నం చేసే దిశగా కూడా.. ఇటీవలి వరకు వైసీపీ నాయకులు ఇటు సోషల్ మీడియాలోను.. అటు బహిరంగ వేదికలపై కూడా.. చర్చకు దారి తీశారు. అయితే.. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత.. పవన్ కల్యాణ్ ఇటీవల మరోసారి కూటమి ప్రాధాన్యాన్ని తేల్చి చెప్పారు. ఎవరు ఉన్నా.. లేకున్నా.. కూటమి కొనసాగుతుందన్నారు.
దీంతో ఇప్పుడు కాపులను తటస్థం చేసేందుకు.. అంటే.. వారు జనసేనకు అనుకూలంగా ఉండకుండా చేయాలన్న వ్యూహాలను తెరమీదికి తెచ్చినట్టు తెలిసింది. దీనిలో భాగంగా మరోసారి.. కాపు ఉద్యమం దిశగా అడుగులు వేసేందుకు కీలక నాయకులను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. 2014-19 మధ్య కాపులు తమకు రిజర్వేషన్ సహా.. ఇతర డిమాండ్లపై ఉద్యమించారు. కానీ, వైసీపీ రావడంతో వారంతా మౌనంగా ఉండిపోయారు.
ఇప్పుడు మరోసారి ఈ ఉద్యమం ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో అంతర్గత చర్చలకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తద్వారా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కాపుల ఉద్యమాన్ని ప్రేరేపించే దిశగా అడుగులు వేయాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. నిజానికి కాపులు ప్రస్తుతం ఉద్యమాలు మానేశారు. తమకు పవన్ ఉన్నాడన్న భరోసా ఉంది. కానీ, ఇదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారి.. వారిలో అనైక్యతను పెంచి.. తటస్థం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
This post was last modified on May 20, 2026 10:49 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…