Political News

ఢిల్లీలో పసుపు జండా రెపరెప..!

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడుతున్నాయని నాడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు ఆవేదనకు లోనయ్యారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి.. ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి పవర్ ఏమిటో చూపాలన్న కసితో సాగిన ఎన్టీఆర్… తెలుగు దేశం పార్టీ (టీడీపీ)పేరిట పార్టీని స్థాపించి సత్తా చాటారు.

ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీ జెండా ఇప్పుడు ఢిల్లీ నడి వీధుల్లో రెపరెపలాడనుంది. అది కూడా ఢిల్లీలోని ఏదో మూల అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే… ఢిల్లీ నగరం నడిమధ్యలో సిటీ ప్రైమ్ లొకేషన్ లో టీడీపీ తన కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

టీడీపీ ఆవిర్భవించి అప్పుడే నాలుగు దశాబ్దాలు గడిచిపోతున్నా… దేశ రాజకీయాల్లో చాలా సార్లు కీలక పార్టీగా పనిచేసినా.. ఇప్పటిదాకా దేశ రాజధాని నగరం ఢిల్లీలో పార్టీకి కార్యాలయం అంటూ లేదు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ను నిత్యం వినిపిస్తూ వస్తున్న టీడీపీ నేతలు… పార్టీకి ఢిల్లీలో కేంద్ర కార్యాలయం గురించి అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే తన నలభై ఏళ్ల ప్రస్థానంలో దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతంగా సాగుతున్న టీడీపీకి ఇప్పుడు ఢిల్లీలో కార్యాలయం కావాలని పార్టీ అధిష్ఠానం భావించింది.

అనుకున్న వెంటనే ఆ విషయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వద్ద ప్రతిపాదించింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఊపిరిగా నిలుస్తున్న టీడీపీ అడగడమే ఆలస్యం అన్నట్లుగా కేంద్రం.. ఈ ప్రతిపాదనపై వేగంగా స్పందించింది. టీడీపీ ప్రతిపాదనను త్వరితగతిన పరిశీలించాలంటూ ఢిల్లీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

వెరసి టీడీపీ ప్రపోజల్ ను తెరచిన ఢిల్లీ సర్కారు… శరవేగంగా దానిపై ఓ నిర్ణయం తీసుకుంది. తాను చేసిన ప్రతిపాదనకు ఢిల్లీ సర్కారు నుంచి వచ్చిన స్పందనకు టీడీపీ ఓకే అనడమే ఆలస్యం క్షణాల్లో టీడీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇట్టే దక్కిపోతుంది. ఆపై కళ్లు మూసి తెరిచేలోగానే ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడించేలా టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న టీడీపీ.. ఢిల్లీ తన కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందని ఆ పార్టీ అధిష్ఠానం కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. పార్టీ కార్యాలయం కోసం 2 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని కోరింది. కేంద్రం ఆదేశాలతో ఈ ప్రతిపాదనను పరిశీలించిన ఢిల్లీ సర్కారు… దీన్ దయాళ్ మార్గ్ లో బీజేపీ కేంద్ర కార్యాలయం పక్కనే ఖాళీగా ఉన్న 1,200 చదరపు మీటర్ల స్థలాన్ని గుర్తించింది.

ఎలాంటి వివాదాలు లేని ఈ స్థలాన్ని టీడీపీకి తక్షణమే బదలాయించవచ్చని ఢిల్లీ చీఫ్ ఆర్కిటెక్ట్ కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ విషయాన్ని టీడీపీకి చేరవేసిన కేంద్రం… తక్షణమే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరింది. వెరసి తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడిన అదే ఢిల్లీ నడి వీధుల్లో అదే తెలుగోడి ఆత్మ గౌరవం సగర్వంగా నిలవనుంది.

Kumar

Recent Posts

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…

2 hours ago

ఆమిర్ ఖాన్… ముచ్చ‌ట‌గా మూడోసారి

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్ 61 ఏళ్ల వ‌య‌సులో ముచ్చ‌ట‌గా మూడోసారి పెళ్లికొడుకు అయ్యారు. కొన్నేళ్ల నుంచి ఆయ‌న…

2 hours ago

పసుపు చీరలో లెనిన్ భామ అందాల మెరుపు

అఖిల్ అక్కినేని సరసన లెనిన్ సినిమాలో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల విడుదలైన లెనిన్…

3 hours ago

కమల్ హాసన్ రికార్డుని కమెడియన్ దాటేశాడు

కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో లెక్కలేనన్ని గొప్ప పాత్రలు పోషించారు. వాటిలో దశావతారంది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఎవరికీ…

3 hours ago

సమంత డామినేషన్ చూశారా?

సమంత కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ రిలీజై 20 రోజులు కావస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండో…

3 hours ago

గాడ్ అఫ్ వార్ వివాదం… తమిళ మిత్రుల తొందరపాటుతనం

ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. కథేంటో ఎవరికీ తెలియదు. క్యాస్టింగ్ లో ఎవరెవరున్నారో టీమ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కేవలం ఒక…

4 hours ago