Political News

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో విజయం దక్కించుకున్న చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదాహరణకు గాజువాక నియోజకవర్గంలో టిడిపి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఊహించ‌ని మెజారిటీని సాధించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ కూడా 90 వుల పైచిలుకు మెజారిటీని దక్కించుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది నాయకులు భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు.

అయితే ఆ సమయంలో కూటమి ప్రభావంతో పాటు వైసిపి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపించింది. దీనివల్లే వీరికి అనూహ్యమైన మెజారిటీ ద‌క్కింద‌న్న‌ వాదన ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఇదే ప్రభావం కనిపిస్తుందా.. లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మారుతుందా.. అనేది ఇప్పుడు కొంతమంది నాయకులలో చర్చనీయాంశంగా మారింది. దీంతో తమ మెజారిటీని తగ్గకుండా చూసుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో ఏఏ మండలాల్లో తమకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి.. ఏ ఏ సామాజిక వర్గాల నుంచి తమకు ఓట్లు భారీ సంఖ్యలో పడ్డాయి.. అనే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. తద్వారా ఆయా మండలాలు, ఆయా సామాజిక వర్గాలను మరింత మంచి చేసుకుని వచ్చే ఎన్నికల సమయానికి తమకు మెజారిటీ పెంచుకోవడంతో పాటు ఒకవేళ పెరిగినా పెరగకపోయినా తమ మెజారిటీని తగ్గకుండా చూసుకునేందుకు నాయకులు ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు.

ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు ఇటీవల పర్యటనలు చేస్తున్నారు. తన సామాజిక వర్గం నాయకులతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడా మమేకమవుతున్నారు. మెజారిటీ తగ్గకుండా చూడాలని ఆయన పదేపదే చెబుతున్నారు. గెలుపు అనేది ఖాయమే అయినప్పటికీ మెజారిటీ ఇప్పుడు ప్రతిష్టాత్మక అంశంగా మారింది. ఇక మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను ఎవరు కలిసినా మెజారిటీపైనే దృష్టి పెట్టాలని ఆయన చెబుతున్నారు.

ఈ రెండు నియోజకవర్గాలే కాదు రాష్ట్రవ్యాప్తంగా భారీ మెజారిటీ ద‌క్కించుకున్న నాయకులంతా ఇదే పనిపై దృష్టి పెట్టడం విశేషం. మరి వీరు అనుకున్నట్టుగా మెజారిటీ కొనసాగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే మెజారిటీ తగ్గకుండా చూసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికిగాను సంక్షేమ పథకాల అమలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

This post was last modified on May 15, 2026 10:40 am

Share

Recent Posts

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…

1 hour ago

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

2 hours ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

3 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

3 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

5 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

11 hours ago