Political News

టెక్నాలజీ మాయ.. గంటకు పది వేల మంది దర్శనం

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు సులభతరంగా మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు చేపట్టిన సరికొత్త చర్యల వల్ల వేలాది మంది భక్తులకు ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతోంది. వెరసి గతంలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.

అదే సమయంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు విడిది సౌకర్యం లభ్యత కూడా బాగా పెరిగింది. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వ్యవస్థ దోహదం చేస్తోందని చెప్పాలి.

ఈ నెల 2న తిరుమల వెంకన్నను 91 వేల మంది దాకా దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కేవలం 12 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సత్తా చాటింది. తాజాగా బుధవారం 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా… వారికి కేవలం 8 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సరికొత్త రికార్డు నమోదు చేసింది.

అంటే…. గంటకు 10 వేల మంది చొప్పున స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో ఇదే 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోవాలంటే 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఐసీసీసీ వల్ల కేవలం ఓ గంటలోనే 10 వేల మందికి స్వామి వారి దర్శనం లభిస్తోంది.

కేవలం అతి స్వల్ప వ్యవధిలోనే స్వామి వారి దర్శనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమలలో విడిది గదులను బుక్ చేసుకుంటున్న భక్తులు.. దర్శనం వెంటనే వాటిని ఖాళీ చేస్తున్నారు. ఫలితంగా తిరుమల కొండపై విడిది గదుల కొరత అన్న సమస్యల ఉత్పన్నం కావడం లేదు.

స్వామి వారి దర్శనం కోసం వస్తున్న దాదాపు అందరు భక్తులకూ విడిది గదులు లభిస్తున్నాయని చెప్పాలి. గతంలో అయితే గదుల కోసం భక్తులు సుదీర్ఘ కాలం పాటు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు త్వరితగతిన దర్శనాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో గదుల లభ్యత కూడా బాగా పెరిగింది.

This post was last modified on May 14, 2026 11:02 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డిప్యూటీ పవన్ సార్ బ్యాక్ టు డ్యూటీ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం అమరావతి చేరుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో…

13 minutes ago

వీడిన కేరళం సీఎం సస్పెన్స్

కేరళం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తాజా మాజీ ప్రధాన ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఎంపికయ్యారు. ఈ…

20 minutes ago

అల్లు అర్జున్ డాన్స్ స్టెప్ కు కూడా కాపీరైట్?

‘పుష్ప’ తగ్గేదేలే మేనరిజం ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. బన్నీ సిగ్నేచర్ స్టైల్‌ని వాడుకోని వాళ్లే లేరు. ఇన్‌స్టా రీల్స్‌లో,…

28 minutes ago

గుట్టుగా మాట్లాడుకుంటే గొడవలెందుకు వస్తాయి

ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో నివురు గప్పిన నిప్పులా మొదలైన సింగల్ స్క్రీన్ల పర్సెంటెజ్ వివాదం ఇప్పుడు నిర్మాతలు,…

33 minutes ago

అల్లు, సురేష్… ముందే పసిగట్టారా?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ వార్ పీక్స్‌లో ఉంది. శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ సింగిల్…

1 hour ago

మహసేన రాజేష్ vs రఘురామ

ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు… టీడీపీ నేతగానే కొనసాగుతున్నా.. ఆయనపై అదే పార్టీకి చెందిన…

2 hours ago