కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు సులభతరంగా మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు చేపట్టిన సరికొత్త చర్యల వల్ల వేలాది మంది భక్తులకు ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతోంది. వెరసి గతంలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.
అదే సమయంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు విడిది సౌకర్యం లభ్యత కూడా బాగా పెరిగింది. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వ్యవస్థ దోహదం చేస్తోందని చెప్పాలి.
ఈ నెల 2న తిరుమల వెంకన్నను 91 వేల మంది దాకా దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కేవలం 12 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సత్తా చాటింది. తాజాగా బుధవారం 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా… వారికి కేవలం 8 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సరికొత్త రికార్డు నమోదు చేసింది.
అంటే…. గంటకు 10 వేల మంది చొప్పున స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో ఇదే 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోవాలంటే 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఐసీసీసీ వల్ల కేవలం ఓ గంటలోనే 10 వేల మందికి స్వామి వారి దర్శనం లభిస్తోంది.
కేవలం అతి స్వల్ప వ్యవధిలోనే స్వామి వారి దర్శనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమలలో విడిది గదులను బుక్ చేసుకుంటున్న భక్తులు.. దర్శనం వెంటనే వాటిని ఖాళీ చేస్తున్నారు. ఫలితంగా తిరుమల కొండపై విడిది గదుల కొరత అన్న సమస్యల ఉత్పన్నం కావడం లేదు.
స్వామి వారి దర్శనం కోసం వస్తున్న దాదాపు అందరు భక్తులకూ విడిది గదులు లభిస్తున్నాయని చెప్పాలి. గతంలో అయితే గదుల కోసం భక్తులు సుదీర్ఘ కాలం పాటు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు త్వరితగతిన దర్శనాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో గదుల లభ్యత కూడా బాగా పెరిగింది.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…