Political News

టెక్నాలజీ మాయ.. గంటకు పది వేల మంది దర్శనం

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు సులభతరంగా మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు చేపట్టిన సరికొత్త చర్యల వల్ల వేలాది మంది భక్తులకు ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతోంది. వెరసి గతంలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.

అదే సమయంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు విడిది సౌకర్యం లభ్యత కూడా బాగా పెరిగింది. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వ్యవస్థ దోహదం చేస్తోందని చెప్పాలి.

ఈ నెల 2న తిరుమల వెంకన్నను 91 వేల మంది దాకా దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కేవలం 12 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సత్తా చాటింది. తాజాగా బుధవారం 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా… వారికి కేవలం 8 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సరికొత్త రికార్డు నమోదు చేసింది.

అంటే…. గంటకు 10 వేల మంది చొప్పున స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో ఇదే 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోవాలంటే 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఐసీసీసీ వల్ల కేవలం ఓ గంటలోనే 10 వేల మందికి స్వామి వారి దర్శనం లభిస్తోంది.

కేవలం అతి స్వల్ప వ్యవధిలోనే స్వామి వారి దర్శనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమలలో విడిది గదులను బుక్ చేసుకుంటున్న భక్తులు.. దర్శనం వెంటనే వాటిని ఖాళీ చేస్తున్నారు. ఫలితంగా తిరుమల కొండపై విడిది గదుల కొరత అన్న సమస్యల ఉత్పన్నం కావడం లేదు.

స్వామి వారి దర్శనం కోసం వస్తున్న దాదాపు అందరు భక్తులకూ విడిది గదులు లభిస్తున్నాయని చెప్పాలి. గతంలో అయితే గదుల కోసం భక్తులు సుదీర్ఘ కాలం పాటు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు త్వరితగతిన దర్శనాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో గదుల లభ్యత కూడా బాగా పెరిగింది.

Kumar

Recent Posts

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

4 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

7 hours ago

ఆర్సీ 17… చెప్పనన్న సుకుమార్

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…

7 hours ago

చంద్రబాబు పవన్ పై మాట పడనివ్వరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…

8 hours ago

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

9 hours ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

10 hours ago