కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు సులభతరంగా మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు చేపట్టిన సరికొత్త చర్యల వల్ల వేలాది మంది భక్తులకు ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతోంది. వెరసి గతంలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.
అదే సమయంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు విడిది సౌకర్యం లభ్యత కూడా బాగా పెరిగింది. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వ్యవస్థ దోహదం చేస్తోందని చెప్పాలి.
ఈ నెల 2న తిరుమల వెంకన్నను 91 వేల మంది దాకా దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కేవలం 12 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సత్తా చాటింది. తాజాగా బుధవారం 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా… వారికి కేవలం 8 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సరికొత్త రికార్డు నమోదు చేసింది.
అంటే…. గంటకు 10 వేల మంది చొప్పున స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో ఇదే 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోవాలంటే 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఐసీసీసీ వల్ల కేవలం ఓ గంటలోనే 10 వేల మందికి స్వామి వారి దర్శనం లభిస్తోంది.
కేవలం అతి స్వల్ప వ్యవధిలోనే స్వామి వారి దర్శనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమలలో విడిది గదులను బుక్ చేసుకుంటున్న భక్తులు.. దర్శనం వెంటనే వాటిని ఖాళీ చేస్తున్నారు. ఫలితంగా తిరుమల కొండపై విడిది గదుల కొరత అన్న సమస్యల ఉత్పన్నం కావడం లేదు.
స్వామి వారి దర్శనం కోసం వస్తున్న దాదాపు అందరు భక్తులకూ విడిది గదులు లభిస్తున్నాయని చెప్పాలి. గతంలో అయితే గదుల కోసం భక్తులు సుదీర్ఘ కాలం పాటు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు త్వరితగతిన దర్శనాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో గదుల లభ్యత కూడా బాగా పెరిగింది.
ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…
గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
ఘట్టమేనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్…
తన సినిమాల్లో పాత్రల కోసం శారీరకంగా ఎంత కష్టానికైనా వెనుకాడని కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ధృవ,…
ఏమాత్రం సినీ నేపథ్యం లేని నారా కుటుంబం నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రోహిత్. నారా అంటే పక్కా పొలిటికల్…