Political News

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు కూడా.. అదేవిధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనికి కార‌ణం.. రాజ్యస‌భ‌లో బ‌లం ఎక్కువ‌గా ఉండ‌డ‌మే. అయితే.. ఇప్పుడు ఆ బ‌లం స‌గానికిపైగా త‌గ్గిపోనుంది. దీంతో కేంద్రంలో వైసీపీ వాయిస్ పెద్ద‌గా వినిపించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం వైసీపీకి రాజ్య‌స‌భ‌లో వైవీ సుబ్బారెడ్డి, మేడా ర‌ఘునాథ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఎస్‌.నిరంజ‌న్ రెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. ఇలా ఏడుగురి బ‌లం ఉంది. అయితే.. వీరిలో ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. పేరుకే వైసీపీ త‌ర‌ఫున ఎన్నికైనా.. ఆయ‌న రాజ‌కీయం అంతా కూడా బీజేపీతోనే ముడి ప‌డి ఉంది. పైగా.. అప్పుడు సీటు కోసం అంబానీతో క‌లిసి జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిమ‌ళ్ న‌త్వానీ ఏపీ వైపు చూసిందేలేదు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఏడుగురి బ‌లం ఉంది. దీంతోనే కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు వైసీపీ విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వైసీపీ కూడా సానుకూలంగానే స‌హ‌క‌రిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ ఏడుగిరిలో ముగ్గురి ప‌ద‌వీ కాలం మ‌రో 40 రోజుల్లోనే ముగిసిపోతుంది. వ‌చ్చే నెల 21తో ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌దవీ కాలం ముగియ‌నుండ‌డంతో వైసీపీకి కేంద్రంలో ప్రాధాన్యం త‌గ్గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

వీరిలో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ప‌రిమ‌ళ్ న‌త్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. వీరంతా వ‌చ్చే నెల 21న రిటైర్ కానున్నారు. పైగా.. ప్ర‌స్తుతం అసెంబ్లీలో వైసీపీ బ‌లం కూడా లేక‌పోవ‌డంతో ఈ సీట్ల‌న్నీ.. అధికార కూట‌మి పార్టీల‌కే చెందుతాయి. ఫ‌లితంగా రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం నరుగురు స‌భ్యుల‌కు ప‌డిపోతుంది. దీంతో స‌హ‌జంగానే రాజ‌కీయంగా ప్రాధాన్యం తగ్గుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే 2029 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తే త‌ప్ప‌.. మ‌ళ్లీ పెద్ద‌ల స‌భ‌పై ఆశ‌లు ఉండ‌వ‌ని చెబుతున్నారు.

Kumar

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

3 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

4 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

5 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

7 hours ago

ఆలూ లేదు చూలూ లేదు… చిరు, నానికి లింకు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…

9 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

13 hours ago