కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా.. అదేవిధంగా వ్యవహరిస్తోంది. దీనికి కారణం.. రాజ్యసభలో బలం ఎక్కువగా ఉండడమే. అయితే.. ఇప్పుడు ఆ బలం సగానికిపైగా తగ్గిపోనుంది. దీంతో కేంద్రంలో వైసీపీ వాయిస్ పెద్దగా వినిపించే అవకాశం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్.నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వానీ.. ఇలా ఏడుగురి బలం ఉంది. అయితే.. వీరిలో పరిమళ్ నత్వానీ.. పేరుకే వైసీపీ తరఫున ఎన్నికైనా.. ఆయన రాజకీయం అంతా కూడా బీజేపీతోనే ముడి పడి ఉంది. పైగా.. అప్పుడు సీటు కోసం అంబానీతో కలిసి జగన్ను కలుసుకునేందుకు వచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిమళ్ నత్వానీ ఏపీ వైపు చూసిందేలేదు. అయినప్పటికీ.. ప్రస్తుతం ఏడుగురి బలం ఉంది. దీంతోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు వైసీపీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. వైసీపీ కూడా సానుకూలంగానే సహకరిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ ఏడుగిరిలో ముగ్గురి పదవీ కాలం మరో 40 రోజుల్లోనే ముగిసిపోతుంది. వచ్చే నెల 21తో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుండడంతో వైసీపీకి కేంద్రంలో ప్రాధాన్యం తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.
వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. వీరంతా వచ్చే నెల 21న రిటైర్ కానున్నారు. పైగా.. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ బలం కూడా లేకపోవడంతో ఈ సీట్లన్నీ.. అధికార కూటమి పార్టీలకే చెందుతాయి. ఫలితంగా రాజ్యసభలో వైసీపీ బలం నరుగురు సభ్యులకు పడిపోతుంది. దీంతో సహజంగానే రాజకీయంగా ప్రాధాన్యం తగ్గుతుందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పుంజుకునే ప్రయత్నం చేస్తే తప్ప.. మళ్లీ పెద్దల సభపై ఆశలు ఉండవని చెబుతున్నారు.
This post was last modified on May 13, 2026 9:52 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…