Political News

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు కూడా.. అదేవిధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనికి కార‌ణం.. రాజ్యస‌భ‌లో బ‌లం ఎక్కువ‌గా ఉండ‌డ‌మే. అయితే.. ఇప్పుడు ఆ బ‌లం స‌గానికిపైగా త‌గ్గిపోనుంది. దీంతో కేంద్రంలో వైసీపీ వాయిస్ పెద్ద‌గా వినిపించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం వైసీపీకి రాజ్య‌స‌భ‌లో వైవీ సుబ్బారెడ్డి, మేడా ర‌ఘునాథ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఎస్‌.నిరంజ‌న్ రెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. ఇలా ఏడుగురి బ‌లం ఉంది. అయితే.. వీరిలో ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. పేరుకే వైసీపీ త‌ర‌ఫున ఎన్నికైనా.. ఆయ‌న రాజ‌కీయం అంతా కూడా బీజేపీతోనే ముడి ప‌డి ఉంది. పైగా.. అప్పుడు సీటు కోసం అంబానీతో క‌లిసి జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిమ‌ళ్ న‌త్వానీ ఏపీ వైపు చూసిందేలేదు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఏడుగురి బ‌లం ఉంది. దీంతోనే కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు వైసీపీ విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వైసీపీ కూడా సానుకూలంగానే స‌హ‌క‌రిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ ఏడుగిరిలో ముగ్గురి ప‌ద‌వీ కాలం మ‌రో 40 రోజుల్లోనే ముగిసిపోతుంది. వ‌చ్చే నెల 21తో ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌దవీ కాలం ముగియ‌నుండ‌డంతో వైసీపీకి కేంద్రంలో ప్రాధాన్యం త‌గ్గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

వీరిలో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ప‌రిమ‌ళ్ న‌త్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. వీరంతా వ‌చ్చే నెల 21న రిటైర్ కానున్నారు. పైగా.. ప్ర‌స్తుతం అసెంబ్లీలో వైసీపీ బ‌లం కూడా లేక‌పోవ‌డంతో ఈ సీట్ల‌న్నీ.. అధికార కూట‌మి పార్టీల‌కే చెందుతాయి. ఫ‌లితంగా రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం నరుగురు స‌భ్యుల‌కు ప‌డిపోతుంది. దీంతో స‌హ‌జంగానే రాజ‌కీయంగా ప్రాధాన్యం తగ్గుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే 2029 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తే త‌ప్ప‌.. మ‌ళ్లీ పెద్ద‌ల స‌భ‌పై ఆశ‌లు ఉండ‌వ‌ని చెబుతున్నారు.

This post was last modified on May 13, 2026 9:52 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YCP

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

2 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

3 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

8 hours ago