Political News

బండి వివాదంపై తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదై 3 రోజులు గడుస్తున్నా భగీరథ్ ను అరెస్ట్ చేయలేదని, ప్రధాని మోదీ టూర్ తర్వాత ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనా చర్యలు లేవని, చట్టం నుంచి అతడికి ఏమైనా మినహాయింపు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదేనా బీజేపీ చెబుతున్న బేటీ బచావో మోదీ గారు అంటూ ప్రధానిని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ జంగిల్ రాజ్ నడుస్తోందని, పోక్సో కేసులో నేరస్తుల మాదిరిగా భగీరథ్ ను ఎందుకు ట్రీట్ చేయడం లేదంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

పోలీసులు భగీరథ్ పై కేసు నమోదు చేయడం లేదని, తనకు న్యాయం జరగడం లేదని బాధితురాలు రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి టీ కాంగ్రెస్ ఒక ఫ్రాంచైజీలా పని చేస్తోందని, రేవంత్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, బండి సంజయ్ ను కాపాడేందుకు, ఈ కేసును నీరుగార్చేందుకు రేవంత్ రెడ్డి సిట్ వేశారని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పటి దాకా రేవంత్ 10 సిట్ లు వేశారని, ఏ ఒక్క సిట్ నివేదక ఇంతవరకు బయటకు రాలేదని విమర్శించారు. అయినా, పోక్సో కేసు పెట్టిన తర్వాత సిట్ ఎందుకని ప్రశ్నించారు.

కేవలం రిట్వీట్ చేసినందుకే బీఆర్ఎస్ కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన రేవంత్ సర్కార్..బండి భగీరథ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేసు పెట్టి 4 రోజులైనా భగీరథ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇది నిదర్శనమని అన్నారు.

Kumar

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

19 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago