తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల కిషోర్ సహా తోటి కమెడియన్లు అందరినీ వెనక్కి నెట్టి టాప్లోకి వెళ్లిపోయాడు సత్య. ఈ తరం ప్రేక్షకులకు చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ అతనే. మత్తు వదలరా-2 చిత్రం తన కెరీర్లో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఆ సినిమా అంత బాగా ఆడిందంటే అది తన వల్లే.
ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఏకంగా సత్యను హీరోగా పెట్టి రితేష్ రాణా ‘జెట్లీ’ మూవీ తీశాడు. ఇందులో సత్య తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు కానీ.. ఓవరాల్గా సినిమా మెప్పించలేకపోయింది. ఈ చిత్రం ఫ్లాప్ అయింది కాబట్టి ఎందుకొచ్చిన హీరో వేషాలని అతనేమీ వెనుకంజ వేయలేదు.
సత్య హీరోగా ఇంకో సినిమా మొదలైంది. ఐతే ఇందులో అతనొక్కడే కథానాయకుడు కాదు.. తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు.
తెలుగులో సత్య ఇప్పుడు రైజ్ అయ్యాడు కానీ.. చాలా ఏళ్ల నుంచి అక్కడ నంబర్ వన్ కమెడియన్గా కొనసాగుతున్నాడు.
అతను ఇప్పటికే ‘మండేలా’ సహా కొన్ని చిత్రాలు చేశాడు. ‘మండేలా’ తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కూడా అతను కామెడీ రోల్స్ చేస్తూనే.. అప్పుడప్పుడూ లీడ్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు సత్య, యోగిబాబును పెట్టి ‘రంగబలి’ దర్శకుడు పవన్ బాసంశెట్టి తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి పవన్ నిర్మాత కూడా కావడం విశేషం. నాగార్జున రెడ్డి అనే మరో యువ నిర్మాతతో కలిసి పవన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ‘రంగబలి’ ఫ్లాప్ అయినప్పటికీ.. అందులో సత్య కామెడీ అదిరిపోతుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకుని బాధపడితే అందులో సంతోషాన్ని వెతుక్కునే పాత్రలో సత్య కడుపుబ్బ నవ్వించాడు.
సత్య నుంచి మంచి కామెడీ రాబట్టుకోగల సత్తా ఉన్న పవన్.. అతడితో పాటు యోగిబాబును కూడా హీరోగా పెట్టి సినిమా తీయాలనుకోవడం విశేషమే. మరి ఈ చిత్రానికి యోగిబాబు లక్ కూడా కలిసొచ్చి హీరోగా సత్య ఖాతాలో మంచి హిట్ పడుతుందేమో చూద్దాం.
This post was last modified on May 11, 2026 8:07 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…