Political News

లెక్కలు మొత్తం బయటకి తీస్తానంటున్న విజయ్

త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ తొలి ప్ర‌సంగంలోనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌జ‌ల సొమ్మును తినేందుకు.. వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు రాలేద‌న్నారు. ప్ర‌తి క్ష‌ణం ప్ర‌జ‌ల కోసం.. పేద‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త డీఎంకే ప్ర‌భుత్వంపై నిశిత విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ప్ర‌భుత్వం 10 ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌ల‌ను అప్పు చేసింద‌న్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌జాధ‌నాన్ని కూడా గ‌త పాల‌కులు దోచుకున్నార‌ని విమ‌ర్శించారు. ఎవ‌రెవ‌రు ఎంత దోచుకున్నారో లెక్క‌లు తీస్తామ‌ని.. ఖ‌జానాను ఖాళీ చేసిన వారిని వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. దీనిపై త్వ‌ర‌లోనే శ్వేత ప‌త్రం(వైట్ పేప‌ర్‌) విడుద‌ల చేయ‌నున్న‌ట్టు విజ‌య్ చెప్పారు. ఖ‌జానా ఖాళీ అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌తి హామీ త‌న‌కు గుర్తుంద‌న్నారు. అనుకున్న ల‌క్ష్యాల‌ను నెర‌వేరుస్తామ‌ని చెప్పారు.

రెండు కేంద్రాలు లేవు..

టీవీకే పార్టీలో రెండుమూడు అధికార కేంద్రాలు లేవ‌ని విజ‌య్ ఉద్ఘాటించారు. ఉన్న‌ది ఒక్క‌టే అధికార కేంద్రం అని వ్యాఖ్యానించారు. అది తానేన‌ని చెప్పారు. రెండు అధికార కేంద్రాల‌ను ఉండ‌వ‌ని, ఉండ‌నివ్వ‌న‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల కోసం.. ప‌నిచేయ‌డ‌మే క‌ర్త‌వ్యంగా వ‌చ్చాన‌న్నారు. త‌న‌ను ప్ర‌జ‌లు ఆహ్వానించార‌ని.. రా.. త‌మ్ముడూ అని పిలిచార‌ని అందుకే వ‌చ్చాన‌ని చెప్పారు. ఈ రాజ‌కీయ ప్ర‌యాణంలో అనేక అవ‌మానాలు ఎదుర్కొన్న‌ట్టు చెప్పారు. డ్ర‌గ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభ‌మైంద‌ని నొక్కిచెప్పారు.

This post was last modified on May 11, 2026 12:23 am

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

16 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago