Political News

మొదటి సారి… బాబు, పవన్ ఇళ్లకు మోదీ

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ టాప్ 10 లో ఉంటారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే భారత్ మరో రేంజ్ కు వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి పవర్ ఫుల్ లీడర్ అయిన మోదీకి ఏపీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రాధాన్యతను మోదీ నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల నివాసాలకు మోదీ వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పవన్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ ను మోదీ పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోదీ వెళ్లారు. మోదీకి మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబుతో మోదీ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని సమకాలీన రాజకీయాలపై, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి పలు అంశాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల ఇళ్లకు మోదీ వెళ్లడంతో ఆ ఇద్దరికీ మోదీ ఎంత ప్రాధాన్యతనిస్తారో మరోసారి నిరూపితమైంది.

Kumar

Recent Posts

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…

16 minutes ago

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

2 hours ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

3 hours ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

3 hours ago

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

4 hours ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

4 hours ago