ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ టాప్ 10 లో ఉంటారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే భారత్ మరో రేంజ్ కు వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి పవర్ ఫుల్ లీడర్ అయిన మోదీకి ఏపీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రాధాన్యతను మోదీ నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల నివాసాలకు మోదీ వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పవన్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ ను మోదీ పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోదీ వెళ్లారు. మోదీకి మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబుతో మోదీ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని సమకాలీన రాజకీయాలపై, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి పలు అంశాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల ఇళ్లకు మోదీ వెళ్లడంతో ఆ ఇద్దరికీ మోదీ ఎంత ప్రాధాన్యతనిస్తారో మరోసారి నిరూపితమైంది.
This post was last modified on May 10, 2026 11:26 pm
మొదట నటుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి.. తర్వాత దర్శకుడిగా మారుతుంటే తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని…
నాలుగు వేల కోట్లతో తీశామని గతంలో రామాయణ గురించి గర్వంగా చెప్పుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా తర్వాత ఆ మాట…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…
త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…