ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ టాప్ 10 లో ఉంటారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే భారత్ మరో రేంజ్ కు వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి పవర్ ఫుల్ లీడర్ అయిన మోదీకి ఏపీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రాధాన్యతను మోదీ నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల నివాసాలకు మోదీ వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పవన్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ ను మోదీ పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోదీ వెళ్లారు. మోదీకి మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబుతో మోదీ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని సమకాలీన రాజకీయాలపై, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి పలు అంశాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల ఇళ్లకు మోదీ వెళ్లడంతో ఆ ఇద్దరికీ మోదీ ఎంత ప్రాధాన్యతనిస్తారో మరోసారి నిరూపితమైంది.
This post was last modified on May 10, 2026 11:26 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…