Political News

మొదటి సారి… బాబు, పవన్ ఇళ్లకు మోదీ

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ టాప్ 10 లో ఉంటారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే భారత్ మరో రేంజ్ కు వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి పవర్ ఫుల్ లీడర్ అయిన మోదీకి ఏపీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రాధాన్యతను మోదీ నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల నివాసాలకు మోదీ వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పవన్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ ను మోదీ పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోదీ వెళ్లారు. మోదీకి మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబుతో మోదీ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని సమకాలీన రాజకీయాలపై, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి పలు అంశాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల ఇళ్లకు మోదీ వెళ్లడంతో ఆ ఇద్దరికీ మోదీ ఎంత ప్రాధాన్యతనిస్తారో మరోసారి నిరూపితమైంది.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

45 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago