మొదట నటుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి.. తర్వాత దర్శకుడిగా మారుతుంటే తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. నటన నుంచి దర్శకత్వంలోకి అడుగుపెట్టిన వాళ్ల మీద మరీ ఎక్కువ అంచనాలేమీ ఉండవు. కానీ వెంకీ మాత్రం తాను యాక్సిడెంటల్ యాక్టర్ అని, బేసిగ్గా మంచి రైటర్ కమ్ డైరెక్టర్ అని తొలి చిత్రం ‘తొలి ప్రేమ’తోనే రుజువు చేశాడు.
తర్వాతి రెండు చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే నిరాశపరిచినా.. ఆపై సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో గొప్ప పేరే సంపాదించాడు. దర్శకుడిగా ఒక గౌరవం సంపాదించాడు. ఇప్పుడు సూర్య లాంటి పెద్ద హీరోతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ చేశాడు వెంకీ. ఐతే సూర్యతో సినిమా అనేసరికి చాలా జాగ్రత్త పడ్డానని.. స్క్రిప్టు విషయంలో తన కెరీర్లో మరే చిత్రానికీ చేయనంత కసరత్తు చేశానని అంటున్నాడు వెంకీ.
తాను అత్యంత సుదీర్ఘ కాలం రాసిన స్క్రిప్టు ఇదేనన్న వెంకీ.. రకరకాల వెర్షన్లతో ఏకంగా తొమ్మిది డ్రాఫ్టులు రెడీ చేసినట్లు తెలిపాడు. ఫైనల్గా ఒక వెర్షన్ ఓకే చేశాక కూడా క్లైమాక్స్ విషయంలో మళ్లీ తర్జన భర్జనలు జరిగినట్లు తెలిపాడు. మూడు రకాల క్లైమాక్సులు రాసి.. సూర్య ముందు పెట్టానని, అందులోంచి ది బెస్ట్ను ఆయన ఓకే చేశారని, క్లైమాక్స్ ఆయన ఛాయిసే అని తెలిపాడు వెంకీ. సూర్య సరసన మామిత బైజు నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందకు రానున్న సంగతి తెలిసిందే.
ఇక తన తర్వాతి సినిమా గురించి చెబుతూ.. ‘సార్’ తర్వాత మళ్లీ ధనుష్తో ఒక సినిమా చేయాలనుకుంటున్నానని.. ఆ స్క్రిప్టు రెడీ అయి, సినిమా పట్టాలెక్కేందుకు రెండేళ్లు పట్టొచ్చని వెంకీ అన్నాడు. ఇది పోలీస్ కథ అని, దాని లైన్ ధనుష్ ఓకే చేశాడని, కానీ అతను బేసిగ్గా రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి.. ఆయన్ని మెప్పించేలా కథ తయారు చేయాలంటే టైం పడుతుందని వెంకీ అన్నాడు.
This post was last modified on July 30, 2026 9:47 am
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…