వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం, పౌర పురస్కారాలు అందించే కార్యక్రమాలు, రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తమిళనాడు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం ఆలపించిన దాఖలాలు లేవు.
దీంతో, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం పాడతారా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ, అనూహ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత ‘జనగణమన’, ‘తమిళ తల్లి’ గీతాలను ఆలపించారు. ఇటీవల కేంద్రం ఉత్తర్వులో జారీ చేసిన విధంగా వందేమాతరంలోని మొత్తం 6 చరణాలనూ పాడడం విశేషం.
అయితే, పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి మాత్రం వందేమాతరం ఆలపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో, బీజేపీ అధికారంలో ఉన్న బెంగాల్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే పాటించకపోతే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే, విజయ్ వందేమాతం పాడకపోయి ఉంటే బీజేపీ నేతలు ఈ పాటికి నానా రచ్చ చేసేవారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
This post was last modified on May 10, 2026 7:22 pm
ఇప్పుడున్న జనరేషన్ హీరోలు దర్శకులుగా మారడం అరుదు. కాకపోతే చిరంజీవి తరంతో పోల్చుకుంటే కొంచెం బెటరని చెప్పొచ్చు. మెగాస్టార్ తో…
నిన్న సాయిపల్లవి పుట్టినరోజు. అసలు విశేషం అది కాదు. రామాయణలో సీతగా నటించిన తనకు బర్త్ డే కానుకగా ఒక…
తమిళ సినీ రాజకీయ వర్గాలతో పాటు తెలుగు విజయ్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఎవరయ్యా అంటే ఠక్కున…
ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అది చూసిన వాళ్లు ఎవ్వరూ అందులో మున్నా పాత్రను…
మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టిన తమిళ స్టార్ హీరో…
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా…