వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం, పౌర పురస్కారాలు అందించే కార్యక్రమాలు, రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తమిళనాడు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం ఆలపించిన దాఖలాలు లేవు.
దీంతో, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం పాడతారా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ, అనూహ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత ‘జనగణమన’, ‘తమిళ తల్లి’ గీతాలను ఆలపించారు. ఇటీవల కేంద్రం ఉత్తర్వులో జారీ చేసిన విధంగా వందేమాతరంలోని మొత్తం 6 చరణాలనూ పాడడం విశేషం.
అయితే, పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి మాత్రం వందేమాతరం ఆలపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో, బీజేపీ అధికారంలో ఉన్న బెంగాల్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే పాటించకపోతే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే, విజయ్ వందేమాతం పాడకపోయి ఉంటే బీజేపీ నేతలు ఈ పాటికి నానా రచ్చ చేసేవారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
This post was last modified on May 10, 2026 7:22 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…