Political News

తమిళనాట పాడిన వందే మాతరం… బెంగాల్ లో లేదెందుకు?

వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం, పౌర పురస్కారాలు అందించే కార్యక్రమాలు, రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తమిళనాడు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం ఆలపించిన దాఖలాలు లేవు.

దీంతో, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం పాడతారా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ, అనూహ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత ‘జనగణమన’, ‘తమిళ తల్లి’ గీతాలను ఆలపించారు. ఇటీవల కేంద్రం ఉత్తర్వులో జారీ చేసిన విధంగా వందేమాతరంలోని మొత్తం 6 చరణాలనూ పాడడం విశేషం.

అయితే, పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి మాత్రం వందేమాతరం ఆలపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో, బీజేపీ అధికారంలో ఉన్న బెంగాల్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే పాటించకపోతే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే, విజయ్ వందేమాతం పాడకపోయి ఉంటే బీజేపీ నేతలు ఈ పాటికి నానా రచ్చ చేసేవారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

Kumar

Recent Posts

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

24 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

7 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

8 hours ago