వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన వ్యవహారం ఆ పార్టీలోనే చిచ్చు పెడుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది నాయకులు జగన్ చేసిన ప్రకటనను గుడ్డిగా సమర్థిస్తూ.. ఆయన వెంట నడుస్తామని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురు నేతల్లో వ్యక్తమవుతోంది.
ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన సోదరులు సైతం మావిగన్ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంలో ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని.. ఎవరి సలహా మేరకు ముందుకు వెళ్లారని ధర్మాన ప్రసాదరావు అంతర్గత చర్చల్లో ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రెడ్డి నాయకుడు కూడా మావిగన్ ప్రకటన సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ వారితో కనీసం చర్చించాలనే ఆలోచన కూడా జగన్ కు లేకపోతే ఇక తమ పరిస్థితి ఏమిటని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
పార్టీ నిర్ణయాలను పాటించడంలో ఎలాంటి సందేహం లేదని.. కానీ వాటిని ప్రజల్లో సమర్థించడం మాత్రం కష్టంగా మారుతోందని కొందరు నేతలు అంటున్నారు. ఇప్పటికే ప్రజలు అమరావతి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారని.. ఇప్పుడు వారిని మావిగన్ వైపు ఎలా మళ్లించగలమని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే ఈ ప్రకటన చేసినట్టుగా ప్రజల్లో భావన ఏర్పడుతోందని.. ఇలాంటి పరిస్థితిలో మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదే ఇప్పుడు వైసీపీలో చాలామంది సీనియర్ నేతల ఆందోళనగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు ఇటీవల ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం. మావిగన్కు మద్దతుగా ఉన్నవారు ఎంతమంది.. వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతమంది అనే అంశంపైనా ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ఏదేమైనా.. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పార్టీలో విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం నేతల్లో పెరుగుతోంది. అయితే తాడేపల్లి ప్యాలెస్ లోని ఒకరిద్దరి చుట్టూనే నిర్ణయాలు పరిమితమవుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు విఫలం కావడంతో.. ఇప్పుడు పార్టీలో అంతర్గత అసంతృప్తి మరింత బయటపడుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…