Political News

వైసీపీలో మావిగన్ ర‌చ్చ ఇంకా స‌మ‌సిపోలేదా..?

వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన వ్యవహారం ఆ పార్టీలోనే చిచ్చు పెడుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది నాయకులు జగన్ చేసిన ప్రకటనను గుడ్డిగా సమర్థిస్తూ.. ఆయన వెంట నడుస్తామని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురు నేతల్లో వ్యక్తమవుతోంది.

ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన సోదరులు సైతం మావిగన్ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంలో ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని.. ఎవరి సలహా మేరకు ముందుకు వెళ్లారని ధర్మాన ప్రసాదరావు అంతర్గత చర్చల్లో ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రెడ్డి నాయకుడు కూడా మావిగన్ ప్రకటన సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ వారితో కనీసం చర్చించాలనే ఆలోచన కూడా జగన్ కు లేకపోతే ఇక తమ పరిస్థితి ఏమిటని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

పార్టీ నిర్ణయాలను పాటించడంలో ఎలాంటి సందేహం లేదని.. కానీ వాటిని ప్రజల్లో సమర్థించడం మాత్రం కష్టంగా మారుతోందని కొందరు నేతలు అంటున్నారు. ఇప్పటికే ప్రజలు అమరావతి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారని.. ఇప్పుడు వారిని మావిగన్ వైపు ఎలా మళ్లించగలమని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే ఈ ప్రకటన చేసినట్టుగా ప్రజల్లో భావన ఏర్పడుతోందని.. ఇలాంటి పరిస్థితిలో మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదే ఇప్పుడు వైసీపీలో చాలామంది సీనియర్ నేతల ఆందోళనగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు ఇటీవల ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం. మావిగన్‌కు మద్దతుగా ఉన్నవారు ఎంతమంది.. వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతమంది అనే అంశంపైనా ఆరా తీసినట్టు తెలుస్తోంది.

ఏదేమైనా.. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పార్టీలో విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం నేతల్లో పెరుగుతోంది. అయితే తాడేపల్లి ప్యాలెస్ లోని ఒకరిద్దరి చుట్టూనే నిర్ణయాలు పరిమితమవుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు విఫలం కావడంతో.. ఇప్పుడు పార్టీలో అంతర్గత అసంతృప్తి మరింత బయటపడుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Satya

Recent Posts

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

5 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

5 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

5 hours ago

అతిథిని ఎక్కువగా అంచనా వేశారు

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…

6 hours ago

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…

7 hours ago

సైలెంటుగా సినిమా చేస్తున్న క్రిష్

తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి సినిమా ‘గమ్యం’తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని అతను…

7 hours ago