దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి. తమిళనాట ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పాలన చేసిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ముగ్గురూ సినిమా వాళ్లే. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టే దిశగా దూసుకెళ్తున్న విజయ్ కూడా సినిమా వాడే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మెగాస్టార్ చిరంజీవి అధికారంలోకి రాలేకపోయినా.. మంచి ఫలితాలే రాబట్టారు. పవన్ కళ్యాణ్ ఒక ఎన్నికలో ఎదురు దెబ్బ తిన్నాక, రెండో ప్రయత్నంలో డిప్యూటీ సీఎం అయ్యారు.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి అద్భుత ఫలితాలు రాబట్టిన వారిలో విజయ్ స్థానం ఎక్కడ అన్నది ఆసక్తికరం. ఈ ఒరవడిలో ఎప్పటికీ నందమూరి తారక రామారావుదే అగ్రస్థానం. ఆయన రికార్డును బద్దలు కొట్టడం ఇంకెవరికీ సాధ్యం కాకపోవచ్చు కూడా. ఆయన 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని పెట్టి.. తర్వాతి ఏడాది జనవరికే ముఖ్యమంత్రి అయిపోయారు. పార్టీ పెట్టాక కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారం చేపట్టారు. 2009 ఎన్నికల్లో ఈ రికార్డును బద్దలు కొట్టాలన్న టార్గెట్తో పార్టీ పెట్టిన 8 నెలల్లోనే సీఎం అవ్వాలని చిరంజీవి ప్రయత్నించారు కానీ.. ఆయన కల నెరవేరలేదు.
తమిళనాడులో ఇప్పటిదాకా పార్టీ పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలో సీఎం అయింది ఎంజీఆర్. అప్పటికే డీఎంకే పార్టీలో ఎమ్మెల్యే అయి ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న ఎంజీఆర్, తర్వాత కరుణానిధితో విభేదించి 1972లో అన్నాడీఎంకే పార్టీ పెట్టారు. ఇంకో ఐదేళ్లకు 1977లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకు సీఎం అవుతున్నారు. అంటే ఎంజీఆర్ కంటే ఆయనది గొప్ప విజయంగా చెప్పాలి. కానీ ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టాక అతి తక్కువ సమయంలో సీఎం అయిన నేతల్లో ఆయన రెండో స్థానంలో నిలుస్తారు. ఈ స్థానాల్లో ఇక మార్పు రావడం అన్నది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
This post was last modified on May 5, 2026 8:03 am
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…