వైసీపీ అధినేత జగన్పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. తరచుగా ఎక్కడ అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఆయనపై నిప్పులు చెరుగుతుంటారు. అయితే.. పంచ్ డైలాగులు మాత్రం పెద్దగా మనకు కనిపించవు. తాజాగా జగన్పై చంద్రబాబు పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. పార్టీలో నూతన నాయకత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు వైసీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ను ఇలానే వదిలేస్తే.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓసీడీ అనేది ఒక వ్యాధి. జగన్కు ఈ వ్యాధి పట్టుకుంది. ఆయనను ఇలానే వదిలేస్తే.. రేపు దేశానికి స్వాతంత్రం కూడా తానే తెచ్చానని చెబుతాడు. అంతేకాదు.. ఆపరేషన్ సిందూర్కు ఆయుధాలు అందించిందికూడా తానేనని ప్రచారం చేసుకుంటాడు. ఇది అత్యంత ప్రమాదకర వ్యాధి. దీనిని వ్యాపింపచేయకుండా జాగ్రత్తలు పాటించాలి. జగన్ నిర్వాకాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. జగన్కు వచ్చిన వ్యాది.. గొడ్డలి పార్టీలో అందరికీ వ్యాపిస్తోందని.. ఇది కరోనా కంటే వేగంగా ఉందని చంద్రబాబు పంచ్ రువ్వారు. ఫేక్ ప్రచారం.. ఫేక్ నేతలు.. అంటూ కామెంట్లు కుమ్మేశారు. ఏ విషయంలో అయినా.. మనకే అనుమానం వచ్చేలా చేయడంలో గొడ్డలి పార్టీ ముందుంటుంది అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సైకో పార్టీ, కిల్లింగ్ పార్టీ, గొడ్డలి పార్టీ అంటూ పదే పదే చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నవ్వుల్లో మునిగిపోయారు.
This post was last modified on April 29, 2026 3:12 pm
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మెగా 158' ప్రారంభోత్సవ వేడుక నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో చూశాం.…
ఇంకో పన్నెండు రోజుల్లో పెద్ది విడుదల కానుంది. ప్రీమియర్ షోలు ఉంటాయో లేదో, అసలు అప్లై చేశారో లేదోననే క్లారిటీ…
పాకిస్థాన్ దేశంలో మన సినిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం క్లాష్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు,…
నిన్నటితో కరుప్పు అలియాస్ వీరభద్రుడు 200 కోట్ల గ్రాస్ దాటినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గ్రౌండ్ రియాలిటీలో ఈ…
ఏముందిలే.. అని లైట్ తీసుకుంటే.. రాజకీయాల్లో కుదిరే పనికాదు. ఏ విషయాన్నయినా.. సీరియస్గానే తీసుకోవాలి.. సిన్సియర్గానే ఆలోచించాలి. లేకపోతే.. ఇబ్బందులు…