Political News

జ‌గ‌న్‌ని ఇలానే వ‌దిలేస్తే…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అంద‌రికీ తెలిసిందే. త‌ర‌చుగా ఎక్క‌డ అవ‌కాశం ఉన్నా.. చంద్ర‌బాబు ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతుంటారు. అయితే.. పంచ్ డైలాగులు మాత్రం పెద్ద‌గా మ‌న‌కు క‌నిపించ‌వు. తాజాగా జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు పంచ్ డైలాగుల‌తో విరుచుకుప‌డ్డారు. పార్టీలో నూత‌న నాయ‌క‌త్వం ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు వైసీపీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్‌ను ఇలానే వ‌దిలేస్తే.. అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఓసీడీ అనేది ఒక‌ వ్యాధి. జ‌గ‌న్‌కు ఈ వ్యాధి ప‌ట్టుకుంది. ఆయ‌న‌ను ఇలానే వ‌దిలేస్తే.. రేపు దేశానికి స్వాతంత్రం కూడా తానే తెచ్చాన‌ని చెబుతాడు. అంతేకాదు.. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ఆయుధాలు అందించిందికూడా తానేన‌ని ప్ర‌చారం చేసుకుంటాడు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర వ్యాధి. దీనిని వ్యాపింప‌చేయ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి. జ‌గ‌న్ నిర్వాకాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాలి“ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. జ‌గ‌న్‌కు వ‌చ్చిన వ్యాది.. గొడ్డ‌లి పార్టీలో అంద‌రికీ వ్యాపిస్తోంద‌ని.. ఇది క‌రోనా కంటే వేగంగా ఉంద‌ని చంద్ర‌బాబు పంచ్ రువ్వారు. ఫేక్ ప్రచారం.. ఫేక్ నేత‌లు.. అంటూ కామెంట్లు కుమ్మేశారు. ఏ విష‌యంలో అయినా.. మనకే అనుమానం వచ్చేలా చేయడంలో గొడ్డలి పార్టీ ముందుంటుంది అని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా సైకో పార్టీ, కిల్లింగ్ పార్టీ, గొడ్డ‌లి పార్టీ అంటూ ప‌దే ప‌దే చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న స‌మ‌యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున న‌వ్వుల్లో మునిగిపోయారు.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

20 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

52 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago