కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి చారిత్రక కార్యక్రమాన్ని నిర్వహించే వేళ.. తెలుగు భాష విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అందుకు భిన్నంగా అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. విశ్వవిద్యాలయానికి చెందిన వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వందేళ్ల ఉత్సవాల సందర్భంగా అతిథులకు స్నాక్ బాక్స్ లను పంపిణీ చేశారు. దీనిపై ముద్రించిన తెలుగు పదాల్లోని దోషాలను చూసిన భాషాభిమానులు అవాక్కు అయ్యారు. సోమవారం విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన గెస్టులకు స్నాక్ బాక్స్ లను అందించారు. ఈ బాక్స్ పై శతాబ్ది ఉత్సవాల వివరాలతో కూడిన స్టిక్కర్ అంటించారు. దానిపై వందేళ్ల వెలుగు.. తరాల ప్రగతికి అడుగు అన్న నినాదాన్ని ఖూనీ చేసేలా అక్షర దోషాలతో తయారు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
‘వందేళ్ల’ అన్న దానికి వండేళ్ళ అని.. వెలుగు అనే పదానికి బదులుగా వేలుగు అని.. తరాలు అన్న సులువుగా రాసే వీలున్న పదాన్ని త్రరాలుగా ప్రింట్ చేయటం చూస్తే.. తెలుగు భాష మీద వారికున్న గౌరవ మర్యాదలు ఇట్టే అర్థమైపోతాయి. ఈ స్నాక్ బాక్స్ ను తయారు చేసే పనిని విశాఖలోని ఒక హోటల్ కు ఏయూ అధికారులు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
వారి ఘనకార్యంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు సిద్ధం చేసే ప్రతి అంశాన్ని ఏయూ అధికారులు నిశితంగా పరిశీలించి ఉంటే.. ఈ తప్పులు కనిపించేవని.. వాటిని సరిదిద్దే అవకాశం ఉండేదని చెబుతున్నారు. తెలుగు భాష పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు? అన్న విమర్శ పలువురు సంధిస్తున్నారు.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…