కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి చారిత్రక కార్యక్రమాన్ని నిర్వహించే వేళ.. తెలుగు భాష విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అందుకు భిన్నంగా అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. విశ్వవిద్యాలయానికి చెందిన వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వందేళ్ల ఉత్సవాల సందర్భంగా అతిథులకు స్నాక్ బాక్స్ లను పంపిణీ చేశారు. దీనిపై ముద్రించిన తెలుగు పదాల్లోని దోషాలను చూసిన భాషాభిమానులు అవాక్కు అయ్యారు. సోమవారం విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన గెస్టులకు స్నాక్ బాక్స్ లను అందించారు. ఈ బాక్స్ పై శతాబ్ది ఉత్సవాల వివరాలతో కూడిన స్టిక్కర్ అంటించారు. దానిపై వందేళ్ల వెలుగు.. తరాల ప్రగతికి అడుగు అన్న నినాదాన్ని ఖూనీ చేసేలా అక్షర దోషాలతో తయారు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
‘వందేళ్ల’ అన్న దానికి వండేళ్ళ అని.. వెలుగు అనే పదానికి బదులుగా వేలుగు అని.. తరాలు అన్న సులువుగా రాసే వీలున్న పదాన్ని త్రరాలుగా ప్రింట్ చేయటం చూస్తే.. తెలుగు భాష మీద వారికున్న గౌరవ మర్యాదలు ఇట్టే అర్థమైపోతాయి. ఈ స్నాక్ బాక్స్ ను తయారు చేసే పనిని విశాఖలోని ఒక హోటల్ కు ఏయూ అధికారులు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
వారి ఘనకార్యంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు సిద్ధం చేసే ప్రతి అంశాన్ని ఏయూ అధికారులు నిశితంగా పరిశీలించి ఉంటే.. ఈ తప్పులు కనిపించేవని.. వాటిని సరిదిద్దే అవకాశం ఉండేదని చెబుతున్నారు. తెలుగు భాష పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు? అన్న విమర్శ పలువురు సంధిస్తున్నారు.
This post was last modified on April 29, 2026 12:46 pm
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…
ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం…
ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే కాక్రోచ్లు లేస్తాయని, ఆంధ్రప్రదేశ్లో తాము కూడా కాక్రోచ్లమేనని అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్…
రాజకీయ రంగప్రవేశానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు థియేటర్లలో అడుగు పెట్టేసింది. తమిళనాడులో…
యువత, సోలో లాంటి చిత్రాలతో మెప్పించి.. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో మంచి డిమాండ్ తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్. ఆ…