ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. ఆయన వల్లే ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. త్వరలోనే విశాఖపట్నం.. ఐటీ పట్నం కానుందని అభిప్రాయపడ్డారు. విశాఖలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం.. నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఒక నగరాన్ని నిర్మించారు!
సీఎంగా చంద్రబాబు ఒక నగరాన్నే నిర్మించారని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించిన విషయాన్ని ఆయన చెప్పారు. ఐటీ అభివృద్ధిలో ఈ నగరం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అంతేకాదు.. భారీ ఆదాయాన్ని కూడా తీసుకువస్తుందని తెలిపారు. బాబు విజన్ ఉన్న నాయకుడని.. ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని వైష్ణవ్ పేర్కొన్నారు. అంతేకాదు.. దేశం గర్వించే నాయకుడని చంద్రబాబు కొనియాడారు.
లోకేష్ ఎనర్జీ.. అద్భుతం!
మంత్రి నారా లోకేష్పైనా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. యువ నాయకుడిగా నారా లోకేష్ ఎనర్జిటిక్గా పనిచేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. సమస్యల పరిష్కారంలో యువనేతలకు లోకేశ్ ఆదర్శమని పేర్కొన్నారు. అదేసమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం.. నిరంతరం తపిస్తున్న సీఎం చంద్రబాబు ఆలోచనలను పుణికిపుచ్చుకున్నారని తెలిపారు.
తనను అనేక సందర్భాల్లో నారా లోకేష్ ఢిల్లీలో కలిశారని.. ఎప్పుడూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే ఆయన చర్చించారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు.. సీఎంగా చంద్రబాబు, మంత్రిగా లోకేష్ నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. ఇలాంటి నాయకులు ఉన్న ఏపీ.. ప్రజలు ఎంతో అదృష్ట వంతులని పేర్కొన్నారు. త్వరలోనే ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా పోటీ ఇవ్వగల స్థాయికి చేరుతుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు.
This post was last modified on April 28, 2026 2:53 pm
అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్…
విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం)…
ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే…
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడం మామూలే. ముఖ్యంగా…
ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి,…
ఇటీవలే జరిగిన ఏక్ దిన్ ఈవెంట్ లో సాయిపల్లవి హిందీలో ధారాళంగా మాట్లాడలేకపోవడాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ కంటెంట్…