అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్ కు సునామి అంటే ఎలా ఉంటుందో పోకిరి రూపంలో పరిచయమయ్యింది ఈ రోజే. అప్పటికే మహేష్ ని ఒక్కడుతో మాస్ కి దగ్గర చేసిన గుణశేఖర్ కన్నా పదింతలు పై స్థాయిలో ఊర మాస్ అంటే ఏంటో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. దెబ్బకు రికార్డుల వర్షం ఎలా కురిపించాలో, టికెట్ కౌంటర్లను డబ్బులతో ఎలా ముంచెత్తాలో ఋజువు చేశారు.
2005. పోకిరి కథను మహేష్ బాబుకి వినిపించే టైంకి పూరి జగన్నాథ్ వరసగా నాలుగు యావరేజ్ లేదా ఫ్లాపుల్లో ఉన్నారు. తన సత్తా ఏంటో టాలీవుడ్ కు మరోసారి చూపించాలనే కసితో ‘ఉత్తంసింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ’ టైటిల్ తో నెరేషన్ ఇచ్చారు. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ లేదా రవితేజతో తీయాలనేది పూరి ప్రాధమిక ఆలోచన కానీ పండుగాడు క్యారెక్టర్ మహేష్ కోసమే రాసిపెట్టి ఉంది. అందుకే అక్కడికి వెళ్ళింది. వినగానే ప్రిన్స్ ఫ్లాట్ అయిపోయాడు. పేరు మార్చమంటే పోకిరిగా ఛేంజ్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ అతిథిగా ప్రారంభమైన పోకిరి ఆ తర్వాత షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంది. మణిశర్మ ఇచ్చిన పాటలు సెట్స్ లోనే అందరితో డాన్సులు చేయించాయి. ప్రకాష్ రాజ్ పాత్ర, ఆశిష్ విద్యార్ధి క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరుకి మాస్ వావ్ అనేశారు. పండుగాడుగా మహేష్ డైలాగులు, మ్యానరిజం, తింగరి మాటలు థియేటర్లలో ఓ రేంజ్ లో పేలాయి. ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్, దేవదేవుడా పాట ఊరు వాడా మ్రోగిపోయాయి. కట్ చేస్తే కనివిని ఎరుగని రికార్డులతో పోకిరి అరాచకం సృష్టించింది.
నెలల తరబడి పోకిరి మేనియా నుంచి మూవీ లవర్స్ బయటికి రాలేకపోయారు. మహేష్ బ్రాండ్ మాస్ లో ఎవరూ కదల్చలేనంత బలంగా పాతుకుపోయింది. ఇలియానా డేట్స్ కోసం నిర్మాతలు క్యూలో నిలబడ్డారు. వసూళ్ల లెక్కలు చూసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మతులు పోయాయి. ఎవడు కొడితే డైలాగు ఊతపదంగా మారిపోయింది. అలా చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న పోకిరి వచ్చి రెండు దశాబ్దాలు అవుతోందంటే కాలం ఎంత వేగంగా పరిగెడుతోందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 28, 2026 6:17 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…