అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్ కు సునామి అంటే ఎలా ఉంటుందో పోకిరి రూపంలో పరిచయమయ్యింది ఈ రోజే. అప్పటికే మహేష్ ని ఒక్కడుతో మాస్ కి దగ్గర చేసిన గుణశేఖర్ కన్నా పదింతలు పై స్థాయిలో ఊర మాస్ అంటే ఏంటో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. దెబ్బకు రికార్డుల వర్షం ఎలా కురిపించాలో, టికెట్ కౌంటర్లను డబ్బులతో ఎలా ముంచెత్తాలో ఋజువు చేశారు.
2005. పోకిరి కథను మహేష్ బాబుకి వినిపించే టైంకి పూరి జగన్నాథ్ వరసగా నాలుగు యావరేజ్ లేదా ఫ్లాపుల్లో ఉన్నారు. తన సత్తా ఏంటో టాలీవుడ్ కు మరోసారి చూపించాలనే కసితో ‘ఉత్తంసింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ’ టైటిల్ తో నెరేషన్ ఇచ్చారు. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ లేదా రవితేజతో తీయాలనేది పూరి ప్రాధమిక ఆలోచన కానీ పండుగాడు క్యారెక్టర్ మహేష్ కోసమే రాసిపెట్టి ఉంది. అందుకే అక్కడికి వెళ్ళింది. వినగానే ప్రిన్స్ ఫ్లాట్ అయిపోయాడు. పేరు మార్చమంటే పోకిరిగా ఛేంజ్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ అతిథిగా ప్రారంభమైన పోకిరి ఆ తర్వాత షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంది. మణిశర్మ ఇచ్చిన పాటలు సెట్స్ లోనే అందరితో డాన్సులు చేయించాయి. ప్రకాష్ రాజ్ పాత్ర, ఆశిష్ విద్యార్ధి క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరుకి మాస్ వావ్ అనేశారు. పండుగాడుగా మహేష్ డైలాగులు, మ్యానరిజం, తింగరి మాటలు థియేటర్లలో ఓ రేంజ్ లో పేలాయి. ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్, దేవదేవుడా పాట ఊరు వాడా మ్రోగిపోయాయి. కట్ చేస్తే కనివిని ఎరుగని రికార్డులతో పోకిరి అరాచకం సృష్టించింది.
నెలల తరబడి పోకిరి మేనియా నుంచి మూవీ లవర్స్ బయటికి రాలేకపోయారు. మహేష్ బ్రాండ్ మాస్ లో ఎవరూ కదల్చలేనంత బలంగా పాతుకుపోయింది. ఇలియానా డేట్స్ కోసం నిర్మాతలు క్యూలో నిలబడ్డారు. వసూళ్ల లెక్కలు చూసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మతులు పోయాయి. ఎవడు కొడితే డైలాగు ఊతపదంగా మారిపోయింది. అలా చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న పోకిరి వచ్చి రెండు దశాబ్దాలు అవుతోందంటే కాలం ఎంత వేగంగా పరిగెడుతోందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 28, 2026 6:17 pm
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు.…
విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం)…
ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే…
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడం మామూలే. ముఖ్యంగా…
ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి,…
ఇటీవలే జరిగిన ఏక్ దిన్ ఈవెంట్ లో సాయిపల్లవి హిందీలో ధారాళంగా మాట్లాడలేకపోవడాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ కంటెంట్…