బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై ఇటీవల పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(కర్ణాటక) చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళా బిల్లుపై ఇటీవల చర్చల సందర్భంగా.. సూర్య మాట్లాడుతూ.. తెలంగాణ-ఏపీని పాకిస్థాన్ను విడగొట్టినట్టు విడదీశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే రాజకీయ దుమారం రేపాయి. తాజాగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మా ఎంపీలే లోక్సభలో ఉండి ఉంటే.. తేజస్వి సూర్య అనే వెధవతో ముక్కు నేలకు రాయించి క్షమాపణలు చెప్పించే వాళ్లం. అన్నారు.
అంతేకాదు.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సూర్యపై పన్నెత్తు మాట కూడా అనలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్థాన్తో పోల్చిన వెధవపై ఒక్క మాట అనలేదంటే.. వారు తెలంగాణలో పుట్టిన వాళ్లేనా? అని ప్రశ్నించారు. సభలోనే ఉన్న కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది రాష్ట్ర ఎంపీలు ఎవరూ దానిపై కనీసం పెదవి విప్పలేదన్నారు. అదే బీఆర్ ఎస్ సభ్యులు ఉండి ఉంటే.. సభలో రణరంగం సృష్టించేవారని చెప్పారు. తేజస్విని దిగివచ్చేలా చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్లోని బీఆర్ ఎస్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను కేసీఆర్ టార్గెట్ చేశారు. తెలంగాణను తీవ్రంగా దూషించినా.. పాకిస్థాన్తో పోల్చినా వీరు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు పౌరుషం లేదన్నారు. కాళేశ్వరంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అవాకులు చవాకులు మాట్లాడితే.. బీఆర్ ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి గట్టిగా బదులిచ్చారని.. ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారని అన్నారు. ఇలాంటి సంస్కృతి, తెలంగాణ వాదం బీఆర్ ఎస్ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం దేశాన్ని కదలించామని పేర్కొన్నారు.
సోనియా రాజీ పడమన్నారు!
తెలంగాణ విషయంలో అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ తనను రాజీ పడాలని కోరారని కేసీఆర్ తెలిపారు. కానీ.. తాను రాజీ పడలేదన్నారు. ఎంతకైనా పోరాడుతకానీ.. తెలంగాణ బిడ్డల తరఫున రాజీ పడేది లేదని ముక్కుమీద గుద్దినట్టు చెప్పానని కేసీఆర్ గుర్తు చేశౄరు.
ఇక, రాష్ట్రంలోని సమస్యలపై ఆయన స్పందిస్తూ.. వ్యవసాయం నుంచి అన్ని రంగాల వరకు.. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకునే విషయంలోను, కూలగొట్టే విషయంలోనూ నెంబర్ 1గా ఉందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనే పరిస్థితిలో కూడా ఈ దౌర్భాగ్య ప్రభుత్వం లేదు. అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…