ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకట్రెండు హిట్లు పడగానే కొందరు హీరోలు చేసే అతి మాములుగా ఉండదు. తమకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వచ్చేసిందని ఫీల్ అయిపోవడం.. కథల్లో భారీతనం, ఎలివేషన్లు కోరుకోవడం.. పారితోషికాలు పెంచేయడం.. ఇలా అతి చేసే హీరోలకు కొదవేమి లేదు ఇండస్ట్రీలో. ఒక ఊహా ప్రపంచం సృష్టించుకుని అందులో బతికేస్తుంటారు ఈ బాపతు హీరోలు.
తనక్కూడా అలాంటి హీరోనే తగిలాడని అంటున్నాడు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే గాయపడ్డ సింహం చిత్ర దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. అతడికి ఇదే తొలి చిత్రం. మరి ఈ కథే చెప్పాడా.. వేరే స్టోరీ చెప్పాడా అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఒక హీరోకు కథ నచ్చి కూడా అందులో ఎలివేషన్లు లేవు అన్న కారణంతో తనతో సినిమా చెయ్యలేదని వెల్లడించాడు కశ్యప్ శ్రీనివాస్.
సదరు హీరో మేనేజర్ తన దగ్గరికి వచ్చి, సారుకు కథ నచ్చింది కానీ, ఇందులో అభిమానులు కోరుకునే ఎలివేషన్లు లేవేంటి అని అభ్యంతర పెట్టినట్లు కశ్యప్ చెప్పాడు. ఐతే ఆ హీరోకు గతంలో కానీ.. ఇప్పుడు కానీ అసలు ఫ్యాన్స్ అన్నవాళ్లే లేరు అన్నది చేదు నిజం అని వ్యాఖ్యానించాడు కశ్యప్.
నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అయితే.. ఎలివేషన్లు లేకపోతే తమకే ఏదోలా అనిపిస్తుందని.. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేని ఇలాంటి హీరోలు ఎలివేషన్లు కోరుకుంటే ఏం చెయ్యాలి అన్నట్లు మాట్లాడాడు కశ్యప్. కొందరు కొన్ని కథల వల్ల స్టార్లు అవుతారని.. కానీ ఆల్రెడీ స్టార్లు అయిపోయాం అనుకుంటేనే కష్టమని కశ్యప్ వ్యాఖ్యానించాడు.
ఇలాంటి హీరోలు వేరే జోన్లో బతుకుతుంటారని.. వాళ్ళతో మనం సినిమా చెయ్యలేని అతను తేల్చేశాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన గాయపడ్డ సింహం మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on April 27, 2026 9:32 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…