Movie News

హీరో గారికి ఫ్యాన్స్ లేరు కానీ ఎలివేషన్లు కావాలి

ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకట్రెండు హిట్లు పడగానే కొందరు హీరోలు చేసే అతి మాములుగా ఉండదు. తమకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వచ్చేసిందని ఫీల్ అయిపోవడం.. కథల్లో భారీతనం, ఎలివేషన్లు కోరుకోవడం.. పారితోషికాలు పెంచేయడం.. ఇలా అతి చేసే హీరోలకు కొదవేమి లేదు ఇండస్ట్రీలో. ఒక ఊహా ప్రపంచం సృష్టించుకుని అందులో బతికేస్తుంటారు ఈ బాపతు హీరోలు.

తనక్కూడా అలాంటి హీరోనే తగిలాడని అంటున్నాడు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే గాయపడ్డ సింహం చిత్ర దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. అతడికి ఇదే తొలి చిత్రం. మరి ఈ కథే చెప్పాడా.. వేరే స్టోరీ చెప్పాడా అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఒక హీరోకు కథ నచ్చి కూడా అందులో ఎలివేషన్లు లేవు అన్న కారణంతో తనతో సినిమా చెయ్యలేదని వెల్లడించాడు కశ్యప్ శ్రీనివాస్.

సదరు హీరో మేనేజర్ తన దగ్గరికి వచ్చి, సారుకు కథ నచ్చింది కానీ, ఇందులో అభిమానులు కోరుకునే ఎలివేషన్లు లేవేంటి అని అభ్యంతర పెట్టినట్లు కశ్యప్ చెప్పాడు. ఐతే ఆ హీరోకు గతంలో కానీ.. ఇప్పుడు కానీ అసలు ఫ్యాన్స్ అన్నవాళ్లే లేరు అన్నది చేదు నిజం అని వ్యాఖ్యానించాడు కశ్యప్.

నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అయితే.. ఎలివేషన్లు లేకపోతే తమకే ఏదోలా అనిపిస్తుందని.. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేని ఇలాంటి హీరోలు ఎలివేషన్లు కోరుకుంటే ఏం చెయ్యాలి అన్నట్లు మాట్లాడాడు కశ్యప్. కొందరు కొన్ని కథల వల్ల స్టార్లు అవుతారని.. కానీ ఆల్రెడీ స్టార్లు అయిపోయాం అనుకుంటేనే కష్టమని కశ్యప్ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి హీరోలు వేరే జోన్లో బతుకుతుంటారని.. వాళ్ళతో మనం సినిమా చెయ్యలేని అతను తేల్చేశాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన గాయపడ్డ సింహం మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

23 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

11 hours ago