Political News

‘కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి’

తెలంగాణ రాష్ట్ర సేన‌(టీఆర్ ఎస్‌) పార్టీని ప్ర‌క‌టించిన మాజీ ఎంపీ, మాజీఎమ్మెల్సీ క‌విత‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. తాను తెలంగాణ‌కు అమ్మ‌గా ఉండాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పారు. “నా మ‌న‌సులో ఉన్న మాట‌ను మీకు చెబుతున్నా. ఈ రాష్ట్రంలోని 3 కోట్ల 50 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు అమ్మ‌గా ఉండాల‌ని ఉంది. అలా అయితేనే.. మీ క‌ష్టాలు తీర్చ‌గ‌లిగేందుకు.. అమ్మ‌గా ఆ బాధ తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.“ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ దారి త‌ప్పారు!

తెలంగాణ సాధ‌న‌లో కీల‌క పాత్ర పోషించిన కేసీఆర్ కారు.. త‌ర్వాత కాలంలో దారి త‌ప్పింద‌ని క‌విత విమర్శించారు. ఏ స‌బ్బండ వ‌ర్గాల కోసం.. పార్టీ ఏర్ప‌డిందో ఆ వ‌ర్గాల‌ను విస్మ‌రించార‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో తాను కూడా భాగ‌స్వామ్యమైనందుకు.. ఆ త‌ప్పుల్లో భాగం ఉన్నందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని క‌విత చెప్పారు. అయితే..కేవ‌లం క్ష‌మాప‌ణ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయితే స‌రిపోతుందా? అని ప్ర‌శ్నించిన క‌విత‌.. తాను.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ద్వారా ప్రాయ‌శ్చిత్తం చేసుకుంటున్నాన‌ని తెలిపారు.

తెలంగాణ ఆత్మ‌..

ఒక‌ప్పుడు తెలంగాణ ఆత్మ‌గా ఉన్న బీఆర్ ఎస్ పార్టీ.. దానిని కోల్పోయింద‌ని క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కొంద‌రికే ప‌రిమితం అయ్యార‌ని దుయ్య‌బ‌ట్టారు. సామాజిక తెలంగాణ సాధిస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఈ సాధ‌న కోస‌మే తాను కొత్త పార్టీని పెడుతున్నాన‌ని చెప్పారు. గ‌తంలో టీఆర్ ఎస్ పార్టీ కోసం.. త‌న ర‌క్తాన్ని ధార‌పోసిన‌ట్టు క‌విత తెలిపారు. తెలంగాణ ఉద్య‌మ కారుల‌ను అవ‌మానించార‌ని.. అయితే.. ఆ నాడు తాను మాట్లాడ‌లేద‌ని చెప్పారు. ఇప్పుడు త‌న‌కు కూడా అదే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మ‌ర‌మ‌నిషి..

కేసీఆర్‌ను ల‌క్ష్యంగా చేసుకుని క‌విత సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. `కేసీఆర్ మ‌న మ‌నిషి కాదు.. మ‌ర మ‌నిషి` అని క‌విత వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు చేనేత‌ల కోసం భిక్షాట‌న చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు పేద‌ల ఇళ్లు కూల‌గొడుతున్నా.. ఎందుకు స్పందించ‌డం లేద‌న్నారు. ఆయ‌న మారిన మ‌నిషి.. మ‌ర మ‌నిషి.. అని క‌విత దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను.. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసి.. కేంద్రంలో పెత్త‌నానికి బ‌య‌లు దేర‌డం వ‌ల్లే.. బీఆర్ ఎస్‌కు ఈ గ‌తి ప‌ట్టింద‌ని విమ‌ర్శించారు.

This post was last modified on April 25, 2026 3:07 pm

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

8 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

8 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago