తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. తెలుగులో అశోక్, నరసింహుడు, జై చిరంజీవ లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో కథానాయికగా నటించిన సమీరా.. హిందీలోనూ పలు చిత్రాలు చేసింది. తమిళంలోనూ వారణుం ఆయిరం (సూర్య సన్నాఫ్ కృష్ణన్)లో నటించింది. చాలా ఏళ్ల ముందే సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ సమీరా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర టాపిక్స్ గురించి మాట్లాడింది.
ఇందులో భాగంగా ఆమె హీరోయిన్ల మీద ప్యాడెడ్, బంప్ బ్రాల కోసం ఎలా ఒత్తిడి తెస్తారో వివరించింది. 20 ఏళ్ల పాటు తాను ఈ తరహా బ్రాలు ధరిస్తూనే ఉన్నట్లు వ్యాఖ్యానించింది. హీరోయిన్లకు బ్లౌజ్లో ప్యాడెడ్ బ్రాలు పెట్టడం మామూలే అని.. మీ బంప్ ఫ్లాట్గా ఉంది అంటూ నడుం కింద కూడా బ్రాలు పెట్టించిన సందర్భాలు చాలా ఉన్నట్లు ఆమె చెప్పింది.
అసిస్టెంట్ డైరెక్టర్లే ఈ మాట చెబుతారని.. తనకైతే లేడీ ఏడీలే వచ్చి ఓపెన్గా విషయం చెప్పేవారని ఆమె వ్యాఖ్యానించింది.
ఇక తన స్కూల్ రోజుల్లో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ఈ ఇంటర్వ్యూలో ఆమె పంచుకుంది. ఒక రోజు బాంద్రాలో స్కూల్ బ్యాగ్ వేసుకుని నడుచుకుని వస్తుంటే.. సైకిల్ మీద వచ్చిన ఒక కుర్రాడు తన చెస్ట్ మీద గట్టిగా కొట్టి నవ్వుకుంటూ వెళ్లాడని.. తాను ఊరుకోకుండా అతణ్ని వెంబడించి సైకిల్ మీది నుంచి కిందికి తోసి, కొట్టి బుద్ధి చెప్పినట్లు ఆమె వెల్లడించింది.
పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన అవసరాన్ని ఈ ఇంటర్వ్యూలో సమీరా గుర్తు చేసింది. తనకు తల్లిదండ్రులు ఆ విషయాలు చెప్పకపోవడం, ఏవో పిచ్చి పుస్తకాల్లో చదివి తెలుసుకోవాల్సి వచ్చిందని.. కానీ తాను మాత్రం తన పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అన్నీ వివరంగా చెబుతానని ఆమె అంది.
This post was last modified on July 18, 2026 2:40 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…