Political News

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం వినిపిస్తూనే ఉంది. ఏటా టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు వేదికగా ఈ డిమాండ్ పై తీర్మానం చేస్తూనే ఉంటుంది.

అంతేకాకెుండా వీలయిన అన్ని మార్గాల ద్వారా కూడా ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు సాధించే దిశగా టీడీపీ సాగుతోంది. అయినా కూడా నేటికీ ఎన్టీఆర్ కు భారత రత్న అందలేదు. దీని వెనుక అసలు కారణం ఇదేనంటూ ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.

ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తనదైన శైలిలో స్పందించిన లక్ష్మీపార్వతి… ఎన్టీఆర్ కు ఇప్పటిదాకా భారత రత్న ఎందుకు రాలేదన్న ప్రశ్నకూ ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటిస్తే… తాను దానిని అందుకుంటానన్న ఒకే ఒక్క కారణంతో టీడీపీనే ఆయనకు భారత రత్నను అడ్డుకుంటోందని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ భారత రత్న అవార్డును తాను అందుకుంటానన్న ఒకే ఒక్క కారణంతో టీడీపీనే ఆయనకు అవార్డు రాకుండా చేస్తోందని కూడా సంచలన ఆరోపణలు గుప్పించారు. 

ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డును సాధించడం కోసం తాను చేయని ప్రయత్నం అంటూ లేదని చెప్పిన లక్ష్మీపార్వతి… ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితుడిగా పేరున్న దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనను తాను కలిశానని చెప్పారు. ఆ తర్వాత ప్రధానిగా ఉన్న ఐకే గుజ్రాల్ నూ కలిశానన్నారు. వారిద్దరూ ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇప్పిస్తామని, అదో చిన్న విషమయని కూడా చెప్పారన్నారు. అయినా కూడా ఎన్టీఆర్ కు భారత రత్న రాలేదన్నారు. ఈ క్రమంలో తాను ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిని కూడా కలిశానని ఆమె చెప్పుకొచ్చారు.

దేవేగౌడ, గుజ్రాల్ లు తన వద్ద అసలు విషయం దాచారన్న లక్ష్మీపార్వతి… వాజ్ పేయి మాత్రం తనకు నిజాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబమే ఆయనకు అవార్డు రాకుండా అడ్డుకుంటోందన్న వాజ్ పేయి… అందుకు కారణం మీరేనని చెప్పారని ఆమె తెలిపారు.

మీ చేతుల మీదుగా ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు రావడం ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇష్ట లేదని వాజ్ పేయి తనకు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఇక మహానాడులో ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు పేరిట చేసే తీర్మానాలను ఆ పార్టీ నేతలు మహానాడు ముగియగానే బుట్ట దాఖలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Kumar

Recent Posts

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

28 minutes ago

రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఏపీలో హాట్ టాపిక్‌!

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…

1 hour ago

డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…

3 hours ago

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…

3 hours ago

అనంత శ్రీరామ్… ఇదేం లాజిక్?

ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…

5 hours ago

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

6 hours ago