Political News

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం… అజెండా ఏంటి?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న ఆయన, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ప్రచారంలో భాగంగా చంద్రబాబు రేపు అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళతారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. హోసూరు సమీపంలోని తాలి వద్ద బహిరంగ సభలో ప్రసంగించనుండగా, ఆవడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు కోరనున్నారు.

రెండో రోజు మధురై, సాత్తూర్ ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించనున్నారు. స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో కూటమి వ్యూహాలపై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా పట్టణాలతో పాటు పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం.

గతంలో ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్డీఏ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు, ఉత్తరాదిలో ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు దక్షిణాదిలో ప్రచారం చేయడం ఆయనకు కొత్త దశగా భావిస్తున్నారు. తమిళనాడులో ఎన్డీఏ స్థిరపడేందుకు కీలక నాయకుడిగా ఆయన పాత్ర పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత, ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చంద్రబాబు భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తోంది. విపక్షాల వైఖరిని ఎండగట్టడంతో పాటు, మహిళా సాధికారతపై తమ కట్టుబాటును వివరించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం.

ఈ పర్యటన ద్వారా తమిళనాడులో ఎన్డీఏ ప్రభావాన్ని పెంచడం, దక్షిణాదిలో కూటమి బలాన్ని విస్తరించడం లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Kumar

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

19 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

51 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago