Political News

జగన్ ‘అక్రమ పొత్తు’పై విరుచుకుపడిన షర్మిల

బిల్లు ఏదైనా సరే.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాజకీయ వర్గాలు విస్తుపోయే విధంగా బీజేపీ భజనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో జగన్‌కు సిగ్గుండాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఘాటుగానే వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుగా ఎన్డీఏ పక్షాన జగన్ నిలబడినందుకు ఆమె ఫైర్ అయ్యారు.

జగన్ వైఖరి ద్వారా బీజేపీతో ఉన్న “అక్రమ పొత్తు” బయటపడిందని షర్మిల విమర్శించారు. విపక్షం ముసుగులో ఉన్న వైసీపీ వాస్తవానికి ఆర్ఎస్సెస్ పక్షాన పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్‌కు ముఖ్యమైందా అని ప్రశ్నించారు.

అక్రమ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, దీనిపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, “కేసుల నుంచి బయటపడటానికి బానిసలా వ్యవహరించాలా?” అని ప్రశ్నించారు. బీజేపీ బిల్లులకు గుడ్డిగా మద్దతు తెలపడం ప్రజాస్వామ్యానికి విఘాతం అని విమర్శించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరికీ వ్యతిరేకత లేదని, కానీ దాన్ని ఇతర బిల్లులతో లింక్ చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, దానిని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుగా 2026 జనాభా లెక్కలు, కుల గణన వివరాలు పరిగణనలోకి తీసుకోవాలని షర్మిల సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, చిన్న రాష్ట్రాల ఆందోళనలను గౌరవించాలని అన్నారు.

అధికారిక గణాంకాలు లేకుండా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనను విమర్శిస్తూ, “ఇది దేశాన్ని మోసం చేసే ప్రయత్నం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు–జగన్–పవన్ కలయికేనని వ్యాఖ్యానించారు. నిజమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.

This post was last modified on April 18, 2026 6:18 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 minute ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

48 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

56 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago