మాములుగా టయర్ 2 హీరోలకు రెండు ఫ్లాపులు రాగానే నిర్మాతలు బడ్జెట్ లు తగ్గించేసి రిస్క్ లేని కథలను ఎంచుకుంటారు. దర్శకులు కూడా అలాంటి వాళ్లే దొరుకుతారు. కానీ విజయ్ దేవరకొండ దానికి మినహాయింపుగా నిలుస్తున్నాడు. హ్యాట్రిక్ డిజాస్టర్లు పలకరించినా సరే లైనప్ విషయంలో తగ్గేదేలే తరహాలో ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఆల్రెడీ రణబాలి, రౌడీ జనార్ధన సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది.
నాని హీరోగా హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ మూవీతో ప్రశంసలు, వసూళ్లు రెండూ తెచ్చిన దర్శకుడు శౌర్యువ్ కాంబోలో రౌడీ హీరో కొత్త ప్రకటన ఇచ్చాడు. ఇది కూడా యాక్షన్ డ్రామానే. పీరియాడిక్ సెటప్ ఉంటుందని వినికిడి. ప్రీ లుక్ లో విజయ్ తో పాటు ఇతర టీమ్ సభ్యుల ఇంటెన్స్ లుక్ చూస్తుంటే అంచనాలకు అందని కంటెంట్ ఏదో డిజైన్ చేస్తున్న వైనం కనిపిస్తోంది. తన బెస్ట్ ఇస్తానని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా హామీ కూడా ఇచ్చేశాడు.
ఒకరకంగా చెప్పాలంటే ఇదంతా విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా సుడి అని చెప్పాలి. ఎందుకంటే రణబాలి స్వాతంత్రం బ్యాక్ డ్రాప్ లో మైత్రి మూవీ మేకర్స్ చాలా పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆల్రెడీ దీని తాలూకు వీడియో క్లిప్పులు వైరల్ గా మారాయి. ఇంకోవైపు దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న రౌడీ జనార్ధన అవుట్ అండ్ అవుట్ వయొలెంట్ సెటప్ తో రూపొందుతోంది. వీటి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా ఇద్దరూ న్యూ జనరేషన్ డైరెక్టర్లే.
లైగర్, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ వైఫల్యాల సంగతి పక్కనపెడితే విజయ్ దేవరకొండకిది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. వీటిలో రెండు బలంగా వర్కౌట్ అయినా నార్త్ ఇండియాలోనూ మార్కెట్ సంపాదించుకోవచ్చు. ఇటీవలే రష్మిక మందన్నని పెళ్లి చేసుకోవడం ద్వారా కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన రౌడీ హీరో మరి ఈ సందర్భంగా తన ట్రాక్ రికార్డును ఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి. ఇక్కడితో అయిపోలేదు. మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి . అవి కూడా పెద్ద స్కేలేనట.
This post was last modified on April 18, 2026 5:45 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…