Political News

మృత్యుంజయురాలి పునర్జన్మ… మాట నిలబెట్టుకున్న లోకేష్

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాణరక్షక ఇంజెక్షన్ అందించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయించారు. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి అయిన స్పైనల్ మాస్క్యూలర్ ఆంట్రోఫీ తో బాధపడుతున్న పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ‘జోల్జెన్స్‌మా’ ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.

చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి సుమారు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగిలిన రూ.6 కోట్ల కోసం ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు లోకేష్ అండగా నిలిచారు. అవసరమైన మొత్తాన్ని తానే ప్రభుత్వం తరుపున భరిస్తానని హామీ ఇచ్చి, విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించారు. హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడబడ్డాయి.

పెరుగుదలను అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ అరుదైన వ్యాధి నుంచి విముక్తి పొందిన పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. ప్రజల సహకారం వృథా కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ చికిత్స జరిగేలా లోకేష్ చర్యలు తీసుకోవడం విశేషంగా నిలిచింది.

“ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. పునర్విక కోసం చేసిన వాగ్దానం నెరవేరింది” అని లోకేష్ పేర్కొన్నారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారి పునర్వికకు ఇది పునర్జన్మలాంటి క్షణంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

This post was last modified on April 18, 2026 4:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ దేవరకొండ సుడి బ్రహ్మాండంగా ఉంది

మాములుగా టయర్ 2 హీరోలకు రెండు ఫ్లాపులు రాగానే నిర్మాతలు బడ్జెట్ లు తగ్గించేసి రిస్క్ లేని కథలను ఎంచుకుంటారు.…

4 minutes ago

ఇటు దేవర-2… అటు మంగళవారం-2

వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లతో కొరటాల శివ టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ ఆయన…

27 minutes ago

విష్ణుప్రియ అయిపోయింది… ఇక అనన్య

ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ అన్న అమ్మాయిలు.. పెయిడ్ సబ్‌స్క్రిప్సన్లు పెట్టి ఆ యూజర్లకు ఎక్స్‌క్లూజిక్ హాట్ కంటెంట్ ఇవ్వడం ద్వారా…

1 hour ago

రజినీ… మళ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడా?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకప్పుడు సౌత్ ఇండియాలో ఏ హీరోకూ అందని రేంజిలో ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌లు,…

3 hours ago

ప్రకాష్‌రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా?

సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. హిందువుల…

3 hours ago

ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి రేవంత్

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి…

4 hours ago