Political News

మృత్యుంజయురాలి పునర్జన్మ… మాట నిలబెట్టుకున్న లోకేష్

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాణరక్షక ఇంజెక్షన్ అందించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయించారు. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి అయిన స్పైనల్ మాస్క్యూలర్ ఆంట్రోఫీ తో బాధపడుతున్న పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ‘జోల్జెన్స్‌మా’ ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.

చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి సుమారు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగిలిన రూ.6 కోట్ల కోసం ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు లోకేష్ అండగా నిలిచారు. అవసరమైన మొత్తాన్ని తానే ప్రభుత్వం తరుపున భరిస్తానని హామీ ఇచ్చి, విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించారు. హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడబడ్డాయి.

పెరుగుదలను అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ అరుదైన వ్యాధి నుంచి విముక్తి పొందిన పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. ప్రజల సహకారం వృథా కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ చికిత్స జరిగేలా లోకేష్ చర్యలు తీసుకోవడం విశేషంగా నిలిచింది.

“ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. పునర్విక కోసం చేసిన వాగ్దానం నెరవేరింది” అని లోకేష్ పేర్కొన్నారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారి పునర్వికకు ఇది పునర్జన్మలాంటి క్షణంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Kumar

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

29 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago