ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాణరక్షక ఇంజెక్షన్ అందించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయించారు. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి అయిన స్పైనల్ మాస్క్యూలర్ ఆంట్రోఫీ తో బాధపడుతున్న పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ‘జోల్జెన్స్మా’ ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.
చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి సుమారు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగిలిన రూ.6 కోట్ల కోసం ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు లోకేష్ అండగా నిలిచారు. అవసరమైన మొత్తాన్ని తానే ప్రభుత్వం తరుపున భరిస్తానని హామీ ఇచ్చి, విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించారు. హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడబడ్డాయి.
పెరుగుదలను అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ అరుదైన వ్యాధి నుంచి విముక్తి పొందిన పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. ప్రజల సహకారం వృథా కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ చికిత్స జరిగేలా లోకేష్ చర్యలు తీసుకోవడం విశేషంగా నిలిచింది.
“ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. పునర్విక కోసం చేసిన వాగ్దానం నెరవేరింది” అని లోకేష్ పేర్కొన్నారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారి పునర్వికకు ఇది పునర్జన్మలాంటి క్షణంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…