ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ అన్న అమ్మాయిలు.. పెయిడ్ సబ్స్క్రిప్సన్లు పెట్టి ఆ యూజర్లకు ఎక్స్క్లూజిక్ హాట్ కంటెంట్ ఇవ్వడం ద్వారా లక్షలు సంపాదించడం ఇప్పుడు ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. సినీ, టీవీ రంగానికి చెందిన మహిళలు ఒక్కొక్కరుగా ఇందులోకి అడుగు పెడుతున్నారు.
ఇది కొన్నేళ్లుగా నడుస్తున్న వ్యవహారమే అయినా.. ఇందులో ఇల్లీగల్ ఏమీ లేకపోయినా.. ‘బిగ్ బాస్’ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిని ఈ మధ్య కొందరు అదేపనిగా టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
యువత బలహీనతలను సొమ్ము చేసుకుంటూ విష్ణుప్రియ లక్షలు సంపాదిస్తోందని.. ఆమెపై చర్యలు చేపట్టాలని.. తన అకౌంట్ బ్లాక్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు దీని గురించి చర్చ జరిగింది.
ఐతే ఈ వ్యవహారంలో పోలీసులు చేసేదేమీ లేదన్నది స్పష్టం. ఈ కేసు, సోషల్ మీడియా ట్రయల్ పుణ్యమా అని విష్ణుప్రియకు ఒక్కసారిగా పెయిడ్ ఫాలోవర్లు మూడింతలు కావడం విశేషం. నెలకు ఏడెనిమిది లక్షలున్న ఆదాయం కాస్తా.. రూ.20 లక్షలకు చేరుకుంది.
ఐతే విష్ణుప్రియను ఏమీ చేయలేకపోయినా సోషల్ మీడియా జనాలు.. ఇప్పుడు ఇంకో తెలుగమ్మాయిపై పడ్డారు. మల్లేశం, వకీల్ సాబ్, పొట్టేల్ సహా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించిన అనన్య నాగళ్ళ కూడా తన సోషల్ మీడియా అకౌంటును పెయిడ్ సబ్స్క్రిప్షన్లోకి మార్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెకు ఇప్పటికే 600 మంది దాకా ఫాలోవర్లు ఉన్నారు.
దీంతో ఒక్కో సబ్స్క్రిప్షన్ మీద రూ.399 చొప్పున ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో లెక్కలు వేస్తున్నారు నెటిజన్లు. దీని గురించి సోషల్ మీడియా చర్చలు, విమర్శలు ఊపందుకున్నాయంటే ఆటోమేటిగ్గా అనన్యకు కూడా ఫాలోవర్లు పెరగడం ఖాయం. అనన్య కూడా ఈ మధ్య పర భాషా కథానాయికలకు దీటుగా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఫాలోవర్లు పెరిగే కొద్దీ.. సినిమాల సంగతెలా ఉన్నా ఈ సబ్స్క్రిప్షన్లతోనే మంచి ఆదాయం సంపాదించడానికి అవకాశముంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…