తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉండగా… ఆ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు.
అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాను కొత్త పార్టీని పెడుతున్నానని ప్రకటించిన కవిత… తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్సేనని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి
తన పార్టీ తెరంగేట్రం తర్వాత తన తొలి టార్టెగ్ బీఆర్ఎస్సేనని కవిత అన్నారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తనను కలిశారని ఆమె చెప్పారు. అయితే తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని తాను ఇప్పుడప్పుడే వెల్లడించబోనని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ మాజీలు తనను కలుస్తూనే ఉన్నారని ఆమె తెలిపారు. తాను పార్టీని ప్రకటించగానే… తనను కలిసిన బీఆర్ఎస్ నేతలంతా తన పార్టీలోకే వస్తారని కూడా ఆమె తెలిపారు.
ఇక తన సోదరుడు, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి కూడా ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేస్తానని ఇటీవలే కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన కవిత… అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం లేకపోయేసరికి ప్రజలు గుర్తుకు వచ్చారని, ఈ క్రమంలో ఆయన ప్రజలను కలుసుకునేందుకు పాదయాత్ర అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు.
ఇక రాజకీయాల్లో తన తొలి ప్రత్యర్ధి బీఆర్ఎస్సేనని చెప్పిన వైనానికి గల కారణాలను కూడా కవిత తనదైన శైలిలో వివరించే యత్నం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కారణంగానే తాను తన తొలి రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను ఎంచుకున్నానని తెలిపారు. ఈ విషయంలో తనలో ఎలాంటి మార్పు రాబోదని ఆమె వెల్లడించారు. ఈ నెల 25న తన పార్టీ పేరుతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తానని కవిత గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కవిత పార్టీ ప్రారంభం అయిన తర్వాత బీఆర్ఎస్ ఎంతగా ఇబ్బంది పడుతుందన్నది చూడాలి.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…