తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉండగా… ఆ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు.
అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాను కొత్త పార్టీని పెడుతున్నానని ప్రకటించిన కవిత… తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్సేనని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి
తన పార్టీ తెరంగేట్రం తర్వాత తన తొలి టార్టెగ్ బీఆర్ఎస్సేనని కవిత అన్నారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తనను కలిశారని ఆమె చెప్పారు. అయితే తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని తాను ఇప్పుడప్పుడే వెల్లడించబోనని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ మాజీలు తనను కలుస్తూనే ఉన్నారని ఆమె తెలిపారు. తాను పార్టీని ప్రకటించగానే… తనను కలిసిన బీఆర్ఎస్ నేతలంతా తన పార్టీలోకే వస్తారని కూడా ఆమె తెలిపారు.
ఇక తన సోదరుడు, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి కూడా ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేస్తానని ఇటీవలే కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన కవిత… అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం లేకపోయేసరికి ప్రజలు గుర్తుకు వచ్చారని, ఈ క్రమంలో ఆయన ప్రజలను కలుసుకునేందుకు పాదయాత్ర అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు.
ఇక రాజకీయాల్లో తన తొలి ప్రత్యర్ధి బీఆర్ఎస్సేనని చెప్పిన వైనానికి గల కారణాలను కూడా కవిత తనదైన శైలిలో వివరించే యత్నం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కారణంగానే తాను తన తొలి రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను ఎంచుకున్నానని తెలిపారు. ఈ విషయంలో తనలో ఎలాంటి మార్పు రాబోదని ఆమె వెల్లడించారు. ఈ నెల 25న తన పార్టీ పేరుతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తానని కవిత గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కవిత పార్టీ ప్రారంభం అయిన తర్వాత బీఆర్ఎస్ ఎంతగా ఇబ్బంది పడుతుందన్నది చూడాలి.
This post was last modified on April 17, 2026 9:49 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…