Political News

వీగిపోయిన బిల్లులు… ఓట్లు ఇంత తక్కువా?

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం కోసం గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఈ బిల్లులపై లోక్ సభలో సుదీర్ఘ చర్చ జరగగా… శుక్రవారం రాత్రి బిల్లులపై ఓటింగ్ జరిగింది. మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కాల్సి ఉండగా… అంతకంటే తక్కువ మంది ఎంపీలు మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఫలితంగా పార్లమెంటులో దిగువ సభ అయిన లోక్ సభలోనే ఈ బిల్లులు వీగిపోయాయి. 

మహిళా బిల్లుకు దాదాపుగా అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నా… ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చివరి క్షణంలో తన వైఖరిని మార్చుకుంది. మహిళా బిల్లుకు తాము అనుకూలమేనని కాంగ్రెస్ అగ్ర నేత, లోక సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దానిని ముడిపెట్టడాన్ని తాము అంగీకరించబోమని ఆయన తెగేసి చెప్పారు. అయితే 2023లోనే మహిళా బిల్లుకు ఆమోదం లభించినా…మరోమారు ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో సంబంధం లేకుండా మహిళా బిల్లుకు ఆమోదం తెలిపేందుకు తమకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఇక డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి విపక్షాలు పలు అంశాలను లేవనెత్తాయి. జనాభా లెక్కల అధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని విపక్షాలు గళం విప్పాయి. అధికార ఎన్డీఏ చెబుతున్నట్లుగా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలకు 50 శాతం మేర నియోజకవర్గాలను పెంచుతామని మాటమాత్రంగా చెప్పడం కాదన్న విపక్షాలు… ఆ విషయాన్ని బిల్లులో ప్రధానంగా ప్రసజ్తావించాలని డిమాండ్ చేశాయి.

ఈ రెండు బిల్లులపై అదికార విపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగగా… సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన ఓటింగ్ రాత్రి 7.30 గంటలకు జరిగింది. ఓటింగ్ జరిగే సమయంలో సభలో 489 మంది ఎంపీలు ఉండగా… వారంతా బిల్లుపై జరిగిన ఓటింగ్ లో పాలుపంచుకున్నారు. బిల్లులకు అనుకూలంగా 278 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 211 మంది ఎంపీలు ఓటు వేశారు. బిల్లులు పాస్ కావాలంటే… సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అయితే కేవలం 278 మంది ఎంపీలు మాత్రమే బిల్లులకు మద్దతు పలికిన నేపథ్యంలో బిల్లులు రెండూ వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 

Kumar

Recent Posts

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

1 hour ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

2 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

3 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

3 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

4 hours ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

4 hours ago