Political News

వీగిపోయిన బిల్లులు… ఓట్లు ఇంత తక్కువా?

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం కోసం గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఈ బిల్లులపై లోక్ సభలో సుదీర్ఘ చర్చ జరగగా… శుక్రవారం రాత్రి బిల్లులపై ఓటింగ్ జరిగింది. మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కాల్సి ఉండగా… అంతకంటే తక్కువ మంది ఎంపీలు మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఫలితంగా పార్లమెంటులో దిగువ సభ అయిన లోక్ సభలోనే ఈ బిల్లులు వీగిపోయాయి. 

మహిళా బిల్లుకు దాదాపుగా అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నా… ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చివరి క్షణంలో తన వైఖరిని మార్చుకుంది. మహిళా బిల్లుకు తాము అనుకూలమేనని కాంగ్రెస్ అగ్ర నేత, లోక సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దానిని ముడిపెట్టడాన్ని తాము అంగీకరించబోమని ఆయన తెగేసి చెప్పారు. అయితే 2023లోనే మహిళా బిల్లుకు ఆమోదం లభించినా…మరోమారు ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో సంబంధం లేకుండా మహిళా బిల్లుకు ఆమోదం తెలిపేందుకు తమకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఇక డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి విపక్షాలు పలు అంశాలను లేవనెత్తాయి. జనాభా లెక్కల అధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని విపక్షాలు గళం విప్పాయి. అధికార ఎన్డీఏ చెబుతున్నట్లుగా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలకు 50 శాతం మేర నియోజకవర్గాలను పెంచుతామని మాటమాత్రంగా చెప్పడం కాదన్న విపక్షాలు… ఆ విషయాన్ని బిల్లులో ప్రధానంగా ప్రసజ్తావించాలని డిమాండ్ చేశాయి.

ఈ రెండు బిల్లులపై అదికార విపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగగా… సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన ఓటింగ్ రాత్రి 7.30 గంటలకు జరిగింది. ఓటింగ్ జరిగే సమయంలో సభలో 489 మంది ఎంపీలు ఉండగా… వారంతా బిల్లుపై జరిగిన ఓటింగ్ లో పాలుపంచుకున్నారు. బిల్లులకు అనుకూలంగా 278 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 211 మంది ఎంపీలు ఓటు వేశారు. బిల్లులు పాస్ కావాలంటే… సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అయితే కేవలం 278 మంది ఎంపీలు మాత్రమే బిల్లులకు మద్దతు పలికిన నేపథ్యంలో బిల్లులు రెండూ వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 

This post was last modified on April 17, 2026 9:02 pm

Share

Recent Posts

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 minutes ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

38 minutes ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

58 minutes ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

1 hour ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

1 hour ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

2 hours ago