కరోనా వచ్చింది.. భారీగా దెబ్బేసిందన్న మాట చాలామంది నోటి నుంచి వింటుంటాం. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఐటీ రంగానికి మాత్రం ఈ మాట వర్తించదని చెబుతున్నారు. అన్ని రంగాలు కరోనా కారణంగా ప్రభావితమయ్యయని.. ఐటీ రంగం మాత్రం ఇందుకు మినహాయింపుగా చెబుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల గిరాకీ తగ్గలేదని.. తాజాగా విడుదలైన జాబ్ ఫ్లాట్ ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్ వర్కు వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో వ్యాపారాలు డిజిటల్ బాట పట్టటంతో.. టెక్నాలజీ వినియోగం అధికమైందని ఈ నివేదిక పేర్కొంది. దీంతో.. ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ పెరిగినట్లుగా తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంపై కరోనా ప్రభావం తక్కువేనని.. కంపెనీలు డిజిటల్ కు మారేందుకు ఐటీ కీలకభూమిక పోషించినట్లు చెబుతున్నారు. ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి. ప్రాజెక్టు మేనేజర్ ఉద్యోగాలకు బెంగళూరులో అధిక గిరాకీ లభించింది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ.. ఫుణేలు నిలిచాయి.. ఐటీ రంగంలో ప్రాజెక్టు మేనేజర్లకు 55 శాతం గిరాకీ ఉంటే.. నిర్మాణ రంగంలో ఆరు శాతం.. రిక్రూట్ మెంట్ రంగంలో ఐదు శాతం.. బ్యాకింగ్ లో మూడు శాతం ఉన్నట్లుగా తేలింది.
డెవలపర్ల రంగంలోనూ గిరాకీ ఉన్నట్లు తేలింది. డెవలపర్లలో గిరాకీ 65 శాతం ఐటీ రంగానికి చెందిన వారేనని తేల్చారు. డెవలపర్లకు ఎక్కువ అవకాశాలు బెంగళూరులో ఉంటే.. తర్వాతి స్థానం ఢిల్లీ.. హైదరాబాద్.. ఫూణెలు నిలిచాయి. డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలకు బెంగళూరులో 28 శాతం గిరాకీ లభిస్తే.. తర్వాతి స్థానంలో ఢిల్లీ.. ముంబయి.. హైదరాబాద్ నిలిచాయి. ఐటీ ఉద్యోగులకు ఎక్కువగా జీతాలు ఇస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం ఫూణెగా తేలింది. నవంబరులో వచ్చిన మొత్తం ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం బెంగళూరు.. ఫుణె.. హైదరాబాద్.. ఢిల్లీ నగరాల్లోనే ఉండటం గమనార్హం.
This post was last modified on December 27, 2020 11:38 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…