కరోనా వచ్చింది.. భారీగా దెబ్బేసిందన్న మాట చాలామంది నోటి నుంచి వింటుంటాం. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఐటీ రంగానికి మాత్రం ఈ మాట వర్తించదని చెబుతున్నారు. అన్ని రంగాలు కరోనా కారణంగా ప్రభావితమయ్యయని.. ఐటీ రంగం మాత్రం ఇందుకు మినహాయింపుగా చెబుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల గిరాకీ తగ్గలేదని.. తాజాగా విడుదలైన జాబ్ ఫ్లాట్ ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్ వర్కు వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో వ్యాపారాలు డిజిటల్ బాట పట్టటంతో.. టెక్నాలజీ వినియోగం అధికమైందని ఈ నివేదిక పేర్కొంది. దీంతో.. ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ పెరిగినట్లుగా తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంపై కరోనా ప్రభావం తక్కువేనని.. కంపెనీలు డిజిటల్ కు మారేందుకు ఐటీ కీలకభూమిక పోషించినట్లు చెబుతున్నారు. ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి. ప్రాజెక్టు మేనేజర్ ఉద్యోగాలకు బెంగళూరులో అధిక గిరాకీ లభించింది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ.. ఫుణేలు నిలిచాయి.. ఐటీ రంగంలో ప్రాజెక్టు మేనేజర్లకు 55 శాతం గిరాకీ ఉంటే.. నిర్మాణ రంగంలో ఆరు శాతం.. రిక్రూట్ మెంట్ రంగంలో ఐదు శాతం.. బ్యాకింగ్ లో మూడు శాతం ఉన్నట్లుగా తేలింది.
డెవలపర్ల రంగంలోనూ గిరాకీ ఉన్నట్లు తేలింది. డెవలపర్లలో గిరాకీ 65 శాతం ఐటీ రంగానికి చెందిన వారేనని తేల్చారు. డెవలపర్లకు ఎక్కువ అవకాశాలు బెంగళూరులో ఉంటే.. తర్వాతి స్థానం ఢిల్లీ.. హైదరాబాద్.. ఫూణెలు నిలిచాయి. డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలకు బెంగళూరులో 28 శాతం గిరాకీ లభిస్తే.. తర్వాతి స్థానంలో ఢిల్లీ.. ముంబయి.. హైదరాబాద్ నిలిచాయి. ఐటీ ఉద్యోగులకు ఎక్కువగా జీతాలు ఇస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం ఫూణెగా తేలింది. నవంబరులో వచ్చిన మొత్తం ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం బెంగళూరు.. ఫుణె.. హైదరాబాద్.. ఢిల్లీ నగరాల్లోనే ఉండటం గమనార్హం.
This post was last modified on December 27, 2020 11:38 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…