Political News

ఐటీ ఉద్యోగులు తప్పనిసరిగా చదవాల్సిన నివేదిక

కరోనా వచ్చింది.. భారీగా దెబ్బేసిందన్న మాట చాలామంది నోటి నుంచి వింటుంటాం. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఐటీ రంగానికి మాత్రం ఈ మాట వర్తించదని చెబుతున్నారు. అన్ని రంగాలు కరోనా కారణంగా ప్రభావితమయ్యయని.. ఐటీ రంగం మాత్రం ఇందుకు మినహాయింపుగా చెబుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల గిరాకీ తగ్గలేదని.. తాజాగా విడుదలైన జాబ్ ఫ్లాట్ ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్ వర్కు వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో వ్యాపారాలు డిజిటల్ బాట పట్టటంతో.. టెక్నాలజీ వినియోగం అధికమైందని ఈ నివేదిక పేర్కొంది. దీంతో.. ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ పెరిగినట్లుగా తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంపై కరోనా ప్రభావం తక్కువేనని.. కంపెనీలు డిజిటల్ కు మారేందుకు ఐటీ కీలకభూమిక పోషించినట్లు చెబుతున్నారు. ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి. ప్రాజెక్టు మేనేజర్ ఉద్యోగాలకు బెంగళూరులో అధిక గిరాకీ లభించింది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ.. ఫుణేలు నిలిచాయి.. ఐటీ రంగంలో ప్రాజెక్టు మేనేజర్లకు 55 శాతం గిరాకీ ఉంటే.. నిర్మాణ రంగంలో ఆరు శాతం.. రిక్రూట్ మెంట్ రంగంలో ఐదు శాతం.. బ్యాకింగ్ లో మూడు శాతం ఉన్నట్లుగా తేలింది.

డెవలపర్ల రంగంలోనూ గిరాకీ ఉన్నట్లు తేలింది. డెవలపర్లలో గిరాకీ 65 శాతం ఐటీ రంగానికి చెందిన వారేనని తేల్చారు. డెవలపర్లకు ఎక్కువ అవకాశాలు బెంగళూరులో ఉంటే.. తర్వాతి స్థానం ఢిల్లీ.. హైదరాబాద్.. ఫూణెలు నిలిచాయి. డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలకు బెంగళూరులో 28 శాతం గిరాకీ లభిస్తే.. తర్వాతి స్థానంలో ఢిల్లీ.. ముంబయి.. హైదరాబాద్ నిలిచాయి. ఐటీ ఉద్యోగులకు ఎక్కువగా జీతాలు ఇస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం ఫూణెగా తేలింది. నవంబరులో వచ్చిన మొత్తం ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం బెంగళూరు.. ఫుణె.. హైదరాబాద్.. ఢిల్లీ నగరాల్లోనే ఉండటం గమనార్హం.

This post was last modified on December 27, 2020 11:38 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

57 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago