తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త కుమార్తె పెళ్లి కూతురైంది. ఆ మధ్యన నిశ్చితార్థమైన ఆమె వివాహం రేపు (సోమవారం) జరగనుంది. సవతితల్లి చేతుల్లో హింసలకు గురై.. నరకం చూడటం.. ఇరుగుపొరుగువారి ఫిర్యాదుతో ఆమె గురించి లోకానికి తెలిసిందే. ఆమె పడిన అవస్థల గురించి తెలిసిన సీఎం కేసీఆర్ కదిలిపోవటమే కాదు.. ఆమెను తన దత్త పుత్రికగా స్వీకరించారు. ప్రగతిభవన్ కు పిలిపించి.. ఆదరించారు.
అప్పటి నుంచి ఆమె యోగక్షేమాలన్ని చూసుకునేందుకు సాంఘిక సంక్షేమశాఖకు చెందిన అధికారులకు అప్పజెప్పారు. అప్పటినుంచి వారి పర్యవేక్షణలో ఉన్న ఆమె.. ఇటీవల పెళ్లి కుదరటం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు తెలియజేయటం.. నిఘా వర్గాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ప్రత్యూష పెళ్లికి ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ కొన్ని నెలల క్రితం జరిగింది.
పెళ్లికి రెండు రోజులు ముందు జరిగే సంప్రదాయాల్ని తాజాగా నిర్వహించారు. ఇందుకు బేగంపేటలోని ఐఏఎస్ గెస్ట్ హౌస్ వేదికైంది. మంగళవాయిద్యాల మధ్య పసుపు దంచటం.. ఒడి నింపటం.. పెళ్లి కుమార్తెను చేయటం లాంటి కార్యక్రమాల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అయితే.. ఇవన్నీ కూడా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అధికారిణిలేనిర్వహించటం విశేషం. సోమవారం హైదరాబాద్ కు చెందిన చరణ్ రెడ్డితో పెళ్లి జరగనుంది.
This post was last modified on December 27, 2020 11:23 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…