Political News

పెళ్లి కూతరైన కేసీఆర్ దత్త కుమార్తె

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త కుమార్తె పెళ్లి కూతురైంది. ఆ మధ్యన నిశ్చితార్థమైన ఆమె వివాహం రేపు (సోమవారం) జరగనుంది. సవతితల్లి చేతుల్లో హింసలకు గురై.. నరకం చూడటం.. ఇరుగుపొరుగువారి ఫిర్యాదుతో ఆమె గురించి లోకానికి తెలిసిందే. ఆమె పడిన అవస్థల గురించి తెలిసిన సీఎం కేసీఆర్ కదిలిపోవటమే కాదు.. ఆమెను తన దత్త పుత్రికగా స్వీకరించారు. ప్రగతిభవన్ కు పిలిపించి.. ఆదరించారు.

అప్పటి నుంచి ఆమె యోగక్షేమాలన్ని చూసుకునేందుకు సాంఘిక సంక్షేమశాఖకు చెందిన అధికారులకు అప్పజెప్పారు. అప్పటినుంచి వారి పర్యవేక్షణలో ఉన్న ఆమె.. ఇటీవల పెళ్లి కుదరటం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు తెలియజేయటం.. నిఘా వర్గాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ప్రత్యూష పెళ్లికి ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ కొన్ని నెలల క్రితం జరిగింది.

పెళ్లికి రెండు రోజులు ముందు జరిగే సంప్రదాయాల్ని తాజాగా నిర్వహించారు. ఇందుకు బేగంపేటలోని ఐఏఎస్ గెస్ట్ హౌస్ వేదికైంది. మంగళవాయిద్యాల మధ్య పసుపు దంచటం.. ఒడి నింపటం.. పెళ్లి కుమార్తెను చేయటం లాంటి కార్యక్రమాల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అయితే.. ఇవన్నీ కూడా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అధికారిణిలేనిర్వహించటం విశేషం. సోమవారం హైదరాబాద్ కు చెందిన చరణ్ రెడ్డితో పెళ్లి జరగనుంది.

This post was last modified on December 27, 2020 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోటీ’లో పవన్ దారిలోనే విజయ్

తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…

10 minutes ago

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

1 hour ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

6 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

11 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

12 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

12 hours ago