పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజుజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చకు ఎంత సమయమైనా ఫర్వాలేదని.. స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే.. రాత్రివేళల్లోనూ చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. సభలో ఒక్కొక్క పార్టీకి 3 గంటల పాటు చర్చకు సమయం ఇస్తున్నామన్నారు. అంతేకాదు.. ఒక పార్టీ తరఫున ఎంత మంది సభ్యులు మాట్లాడాలని అనుకున్నా.. స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఒక పార్టీ తరఫున ఒక సభ్యుడే సభకు వస్తే.. ఆ సభ్యుడికి కూడా కావాల్సినంత సమయం ఇస్తామని.. చెప్పారు. బిల్లులపై 15 గంటల నుంచి 22 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు.
అనంతరం.. రేపు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభ్యులు తమ డిమాండ్లను.. తమ సూచనలు, సలహాలు తెలియజేసేందుకు మహత్తర అవకాశంగా పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ..పలువురు సభ్యులు చేసిన ప్రకటన నేపథ్యంలో అధికార పక్షం ఇలా సమయం ఇవ్వడం గమనార్హం. సభ్యులు అందరూ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని పేర్కొనడం విశేషం.
ఇదిలావుంటే.. ఇలా .. సభలో భారీ స్థాయిలో సమయం కేటాయించడం అనేది ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. గతంలో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సమయంలో రాత్రివేళల్లో కూడా సభను కొలువుదీర్చారు.
ఆ తర్వాత.. 2023లో మహిళా రిజర్వేషన్ కోసం చేపట్టిన ప్రక్రియపై చర్చించేందుకు కూడా ఇలానే కొంత వెసులుబాటు ఇచ్చారు. అయితే.. వాటికి భిన్నంగా.. ఇప్పుడు పార్టీలకు 3 గంటల చొప్పున కేటాయిస్తామని చెప్పడం ఇదే తొలిసారి. ఏదేమైనా.. సాధించుకోవాలన్న పట్టుదల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మక అడుగు వేసిందనే చెప్పాలి.
This post was last modified on April 16, 2026 2:29 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…