అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై ఆలోచిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. బెంగళూరులోని యలహంక నివాసాన్ని పరిమితంగా ఉపయోగిస్తున్న ఆయనపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, పార్టీ వ్యవహారాల నిర్వహణకు మరింత అనుకూలమైన కేంద్రాన్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో హైదరాబాద్లోని లోటస్పాండ్ మళ్లీ జగన్ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మారవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉంటే పార్టీ నేతలు, కార్యకర్తలతో సులభంగా కలిసే వీలుతో పాటు, “బెంగళూరులో ఉంటూ ఏపీ రాజకీయాలు” అన్న విమర్శలకు సమాధానం చెప్పగలమనే భావన వైసీపీ వర్గాల్లో ఉంది.
అదనంగా, తాడేపల్లితో పోలిస్తే హైదరాబాద్లో నియంత్రణలు తక్కువగా ఉండటం కూడా ఈ మార్పుకు ఒక కారణంగా చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక కేవలం రాజకీయ లెక్కలే కాకుండా సెంటిమెంట్ కూడా పని చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2017లో చేపట్టిన పాదయాత్ర సమయంలో జగన్ మొత్తం కార్యాచరణను లోటస్పాండ్ నుంచే నడిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన విజయాన్ని ఆ సెంటిమెంట్తో అనుసంధానిస్తూ, ఇప్పుడు అదే అనుభవాన్ని మళ్లీ పునరావృతం చేయాలనే ప్రయత్నంగా ఈ మార్పును కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇక ప్రత్యర్థులు చేస్తున్న “రాష్ట్రానికి దూరంగా ఉంటూ రాజకీయాలు” అన్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ఆలోచన కూడా ఈ నిర్ణయానికి బలం చేకూర్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ఇతర ప్రధాన నేతలు కూడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితిలో, జగన్ కూడా అదే విధానం అనుసరిస్తే విమర్శల తీవ్రత తగ్గుతుందన్న అంచనా ఉంది.
మొత్తంగా చూస్తే, జగన్ మకాం మార్పు ఒకేసారి సెంటిమెంట్, వ్యూహం రెండింటి మేళవింపుగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అన్నది మాత్రం రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది.
ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…
గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
ఘట్టమేనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్…
తన సినిమాల్లో పాత్రల కోసం శారీరకంగా ఎంత కష్టానికైనా వెనుకాడని కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ధృవ,…
ఏమాత్రం సినీ నేపథ్యం లేని నారా కుటుంబం నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రోహిత్. నారా అంటే పక్కా పొలిటికల్…