అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై ఆలోచిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. బెంగళూరులోని యలహంక నివాసాన్ని పరిమితంగా ఉపయోగిస్తున్న ఆయనపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, పార్టీ వ్యవహారాల నిర్వహణకు మరింత అనుకూలమైన కేంద్రాన్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో హైదరాబాద్లోని లోటస్పాండ్ మళ్లీ జగన్ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మారవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉంటే పార్టీ నేతలు, కార్యకర్తలతో సులభంగా కలిసే వీలుతో పాటు, “బెంగళూరులో ఉంటూ ఏపీ రాజకీయాలు” అన్న విమర్శలకు సమాధానం చెప్పగలమనే భావన వైసీపీ వర్గాల్లో ఉంది.
అదనంగా, తాడేపల్లితో పోలిస్తే హైదరాబాద్లో నియంత్రణలు తక్కువగా ఉండటం కూడా ఈ మార్పుకు ఒక కారణంగా చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక కేవలం రాజకీయ లెక్కలే కాకుండా సెంటిమెంట్ కూడా పని చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2017లో చేపట్టిన పాదయాత్ర సమయంలో జగన్ మొత్తం కార్యాచరణను లోటస్పాండ్ నుంచే నడిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన విజయాన్ని ఆ సెంటిమెంట్తో అనుసంధానిస్తూ, ఇప్పుడు అదే అనుభవాన్ని మళ్లీ పునరావృతం చేయాలనే ప్రయత్నంగా ఈ మార్పును కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇక ప్రత్యర్థులు చేస్తున్న “రాష్ట్రానికి దూరంగా ఉంటూ రాజకీయాలు” అన్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ఆలోచన కూడా ఈ నిర్ణయానికి బలం చేకూర్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ఇతర ప్రధాన నేతలు కూడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితిలో, జగన్ కూడా అదే విధానం అనుసరిస్తే విమర్శల తీవ్రత తగ్గుతుందన్న అంచనా ఉంది.
మొత్తంగా చూస్తే, జగన్ మకాం మార్పు ఒకేసారి సెంటిమెంట్, వ్యూహం రెండింటి మేళవింపుగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అన్నది మాత్రం రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది.
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…