Political News

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ ఒక ట్వీట్ చేశారు. ‘ దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలు వ‌స్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు.. నిలువెల్లా స్వార్థం, మ‌న‌సంతా విధ్వంసంతో ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం.. అమ‌రావ‌తిని మార్చేస్తాం.. క‌ట్టిన‌వ‌న్నీ కూల్చేస్తాం.. కంపెనీల‌న్నీ వెళ్ల‌గొడ‌తాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారూ!

దేశ రక్షణకు అధునాత‌న‌ బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగ‌తించాల్సింది పోయి, త‌రిమేస్తానంటారా? ఇదేం రాక్ష‌స మ‌న‌స్త‌త్వం? మత్స్యకారుల పిల్ల‌ల‌కు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వ‌స్తాయంటే.. ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాన‌న‌డం ముమ్మాటీకీ సైకోయిజ‌మే..’ అని ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. 

ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం అంటూ వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. మత్స్యకారులను జువ్వలదిన్నె నుంచి తరిమేయాలనుకుంటున్నారని జగన్ నిన్నటి కార్యక్రమంలో అన్నారు.

మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. జువ్వలదిన్నెకు చెందిన 79 ఎకరాల్లో సగం సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు కేటాయిస్తున్నాడు. వచ్చేది వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు.. అని జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

దేశ రక్షణకు అధునాత‌న‌ బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగ‌తించాల్సింది పోయి, త‌రిమేస్తానంటారా? అని ఆయన ప్రశ్నించారు.

This post was last modified on April 16, 2026 2:25 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago