ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేస్తున్న అమెరికా.. రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ సహా ఇరాన్ ప్రతినిధి బృందం హాజరైంది. అయితే.. ఈ చర్చలు ఫలించలేదు. ఇరాన్ షరతులకు తాము అంగీకరించేది.. అమెరికా షరతులకు తాము తలొగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేశాయి.
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన సోషల్ సామాజిక మాధ్య మం వేదికగా.. సంచలన ప్రకటన చేశారు. గతంలో వెనుజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేయడానికి ముందు.. ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న సంకల్పంతో ప్రయోగించిన అస్త్రం తాలూకు మీడియా వార్తలను ఆయన పంచుకున్నారు. ఆనాడు.. వెనుజువెలాకు రవాణా అవుతున్న చమురు నౌకలను సముద్రంలో దిగ్బంధించారు. దీంతో వెనుజువెలా రెండు మాసాల పాటు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
ఇప్పుడు ఇరాన్కు కూడా ఇదే గతి(ది…సేమ్ సిట్యుయేషన్) పడుతుందని అర్ధం వచ్చేలా ట్రంప్ పోస్టు చేశారు. అంటే.. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు అయిన.. చమురు నౌకలను అంగుళం కూడా ముందుకు కదలకుండా అడ్డుకునే అస్త్రాన్ని ట్రంప్ ప్రయోగించనున్నారు.
తద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రభావితం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు .. ఇరాన్కు ఆయుధాలు ఇచ్చే దేశాలను తాజాగా మరోసారి నేరుగా ట్రంప్ హెచ్చరించారు. రష్యా సహా చైనాలు ఇరాన్కు సాయం చేస్తున్నాయని.. ఆయా దేశాలపై 200 శాతం సుంకాలు విధిస్తానని తేల్చి చెప్పారు.
భారత్కు సంకటం..
ఇరాన్కు మిత్ర దేశంగా ఉన్న భారత్.. ఇంత సందిగ్ధతలో కూడా.. చమురు నౌకలు తెచ్చుకుంటోంది. కానీ.. నేరుగా ఇరాన్పైనే అమెరికా ఉక్కుపాదం మోపితే.. ఇక, ఇరాన్ చౌమురు నౌకల నుంచి ఇంధనం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు.
ఇది.. వారాలు.. నెలల తరబడి కొనసాగే అవకాశం ఉంది. వెనుజువెలాను హెచ్చరించేందుకు రెండు నెలల పాటు ఆ దేశ చమురు నౌకలను దిగ్బంధించారు. ఇప్పుడు ఇరాన్ను దిగ్బంధించేందుకు కనీసంలో కనీసం రెండు నెలలైనా పడుతుందని అంచనా ఉన్నాయి. ఇదే జరిగితే భారత్కు ఇంధనం, గ్యాస్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ధరలు పెరిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…