జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని జగిత్యాలలో మెజారిటీ రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ ఆయనకు తక్కువ చేయలేదని, అనేక పదవులు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం ప్రారంభించారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని, సరైన గుర్తింపు ఇవ్వడం లేదని చెబుతూ జీవన్ రెడ్డి ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. అయితే ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఆయన తొందరపడ్డారని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తెలిపారు. జీవన్ రెడ్డి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిగణించారని కూడా చెప్పారు.
ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా జీవన్ రెడ్డి తొందరపడ్డారన్న చర్చ నడుస్తోంది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన స్థానికంగా ఆ పార్టీ నేతగానే ఎదిగారు. అంతేకాదు, బీఆర్ ఎస్కు వ్యతిరేకంగా కూడా పలు సందర్భాల్లో పోరాటాలు చేశారు. గతంలో కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజకీయంగా కూడా 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ ఎస్లో చేరడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్పై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలుచుకున్న ఆయన ఇప్పుడు దాన్ని బీఆర్ ఎస్ వైపు మళ్లించగలరా అన్నది కీలకం. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్నది ముందున్న రోజుల్లో తేలనుంది.
This post was last modified on April 11, 2026 9:58 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…