జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల.. ఇటీవల ఒక షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మెగా బ్రదర్ నాగబాబు తనయురాలైన కొణిదెల నిహారిక.. విడాకులు తీసుకునే సందర్భంలో, తమ కుటుంబంలో డైవర్స్ తీసుకోవడంలో ఎంతో అనుభవమున్న పవన్ కళ్యాణ్ సలహా తీసుకున్నట్లు చెబుతూ ఒక షోలో కామెడీ పండించడానికి ట్రై చేశాడు అనుదీప్.
అతడి కామెంట్స్ చూస్తే ఎవ్వరికైనా టూమచ్ అనిపించక మానవు. నవ్వించడం కోసం మరీ ఈ స్థాయికి దిగజారిపోవాలా అంటూ అనుదీప్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఈ వీడియోలు చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనుదీప్ను ఆటాడేసుకుంటున్నారు అభిమానులు.
ఐతే ఆన్ లైన్ ట్రోలింగ్తో సరిపెట్టకుండా.. కొందరు అభిమానులు అనుదీప్ స్టాండప్ కామెడీ షోలు నిర్వహించే చోటుకు వెళ్లిపోయారు. అనుదీప్ ది స్ట్రీట్ కామెడీ క్లబ్లో షోలు చేస్తుంటాడని తెలుసుకుని అక్కడికి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉడే మెగా అభిమానుల గ్యాంగ్ వెళ్లింది.
అక్కడో కమెడియన్ షో చేస్తుంటే ఆడిటోరియంలోకి వెళ్లి.. అనుదీప్ కోసం ఆరా తీసింది. అతను రాలేదని తెలిసి ఫ్యాన్స్ తనపై బూతుల వర్షం కురిపించారు. పద్ధతిగా కామెడీలు చేసుకోకుండా పర్సనల్స్లోకి వస్తారా అంటూ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనుదీప్ ఇక్కడికి రావాలని అరుస్తూ అతణ్ని బండ బూతులు తిట్టారు. అభిమానుల అగ్రహం చూస్తుంటే.. అనుదీప్ దొరికితే వీళ్లేం చేస్తారో అనిపించకుండా ఉండదు. అనుదీప్ వ్యాఖ్యల విషయంలో అభ్యంతరాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కేసులు పెట్టాలని సూచించగా.. ముందు అతను బయటికి వస్తే తన సంగతి చూస్తామంటూ అభిమానులు హెచ్చరించారు.
This post was last modified on April 11, 2026 10:56 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…