జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల.. ఇటీవల ఒక షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మెగా బ్రదర్ నాగబాబు తనయురాలైన కొణిదెల నిహారిక.. విడాకులు తీసుకునే సందర్భంలో, తమ కుటుంబంలో డైవర్స్ తీసుకోవడంలో ఎంతో అనుభవమున్న పవన్ కళ్యాణ్ సలహా తీసుకున్నట్లు చెబుతూ ఒక షోలో కామెడీ పండించడానికి ట్రై చేశాడు అనుదీప్.
అతడి కామెంట్స్ చూస్తే ఎవ్వరికైనా టూమచ్ అనిపించక మానవు. నవ్వించడం కోసం మరీ ఈ స్థాయికి దిగజారిపోవాలా అంటూ అనుదీప్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఈ వీడియోలు చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనుదీప్ను ఆటాడేసుకుంటున్నారు అభిమానులు.
ఐతే ఆన్ లైన్ ట్రోలింగ్తో సరిపెట్టకుండా.. కొందరు అభిమానులు అనుదీప్ స్టాండప్ కామెడీ షోలు నిర్వహించే చోటుకు వెళ్లిపోయారు. అనుదీప్ ది స్ట్రీట్ కామెడీ క్లబ్లో షోలు చేస్తుంటాడని తెలుసుకుని అక్కడికి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉడే మెగా అభిమానుల గ్యాంగ్ వెళ్లింది.
అక్కడో కమెడియన్ షో చేస్తుంటే ఆడిటోరియంలోకి వెళ్లి.. అనుదీప్ కోసం ఆరా తీసింది. అతను రాలేదని తెలిసి ఫ్యాన్స్ తనపై బూతుల వర్షం కురిపించారు. పద్ధతిగా కామెడీలు చేసుకోకుండా పర్సనల్స్లోకి వస్తారా అంటూ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనుదీప్ ఇక్కడికి రావాలని అరుస్తూ అతణ్ని బండ బూతులు తిట్టారు. అభిమానుల అగ్రహం చూస్తుంటే.. అనుదీప్ దొరికితే వీళ్లేం చేస్తారో అనిపించకుండా ఉండదు. అనుదీప్ వ్యాఖ్యల విషయంలో అభ్యంతరాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కేసులు పెట్టాలని సూచించగా.. ముందు అతను బయటికి వస్తే తన సంగతి చూస్తామంటూ అభిమానులు హెచ్చరించారు.
ఏపీలో రాజకీయాలు ఎలాగైతే అంతకంతకూ వేడెక్కిపోతున్నాయో.. నేరాలు కూడా అదే రీతిన హడలెత్తిస్తున్నాయి. ఆయా నేరాలకు పాల్పడిన వారు… వాటి…
పెద్ది థియేటర్ రన్ దాదాపుగా ముగిసింది. నెలల రోజులు పూర్తి కావడంతో చాలా సెంటర్లలో నామ మాత్రపు వసూళ్లు వస్తున్నాయి.…
"ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే..…
దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో ఏపీలో మాత్రమే రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నా……
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల కోతల బాటలోనే కొనసాగుతున్నాయి. ఇటీవల మెటా వేలాది మంది ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు…
టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి…