Political News

మీడియాలోకి సాయిరెడ్డి.. పక్షపాతం లేకుండా…!

అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫాం ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

వైసీపీలో ఒకప్పుడు కీలక వ్యక్తిగా, వైయస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు, ఆ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పదవులను అనుభవించి.. తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు.

పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో ఆయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అయితే లిక్కర్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్న సమయంలో పలుసార్లు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జగన్ కోటరీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని కూడా ప్రకటించారు. 

ఈ క్రమంలో ఆయన సడెన్ గా.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పక్షపాతం లేకుండా, నిజాయితీతో వార్తలను అందించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. సాధారణ ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ప్లాట్‌ఫాం లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కంటెంట్ రూపొందించనున్నట్లు తెలిపారు.

మరోవైపు ఈ మీడియా వేదిక ఎలాంటి రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకుండా స్వతంత్రంగా కొనసాగుతుందని విజయసాయి స్పష్టం చేశారు. నిష్పక్షపాత ధోరణితో వార్తలను అందించడమే లక్ష్యమని వెల్లడించారు.

భవిష్యత్‌లో శాటిలైట్ ఛానల్ ను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాట్‌ఫాం పేరును త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంటూ, తదుపరి వివరాల కోసం వేచి చూడాలని కోరారు.

విజయ సాయి వైసీపీలో ఉన్నప్పుడే ఒక కొత్త మీడియా వేదికను మొదలు పెడతారనే వార్తలు వినిపించాయి. కొత్త మీడియా ఛానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు 2022లోనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన సొంత మీడియా పెడతారా లేదా, లేక వైయస్సార్‌సీపీ తరపున వేరే ఛానెల్ బాధ్యతలు తీసుకుంటున్నారా అనే చర్చ అప్పట్లో జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలలో విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు మూడేళ్ల ముందుగా సొంత ఛానల్ ను స్టార్ట్ చేస్తానని చెప్పడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.

This post was last modified on April 11, 2026 12:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెక్క తప్పిన సాయిపల్లవి జాగ్రత్తలు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఇవాళ విడుదలయ్యింది. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్…

11 minutes ago

పెద్ది అయోమ‌యంపై ర‌విబాబు అస‌హ‌నం

ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్ర‌తి సినిమాకూ రిలీజ్ డేట్ మార‌డం అన్న‌ది మామూలైపోయింది. ఐతే…

3 hours ago

విజయ్ గురించి మన వాళ్లు కొట్టేసుకుంటున్నారు

ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…

5 hours ago

94 వయసులో ‘సింగీతం’ మాయాజలం

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…

6 hours ago

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్.. ఎవరెవరికి ఎంత ఛాన్స్?

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…

8 hours ago

‘చిట్టి’బాబుని ‘పెద్ది’గాడు కొట్టగలడా?

ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…

9 hours ago