Political News

మీడియాలోకి సాయిరెడ్డి.. పక్షపాతం లేకుండా…!

అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫాం ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

వైసీపీలో ఒకప్పుడు కీలక వ్యక్తిగా, వైయస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు, ఆ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పదవులను అనుభవించి.. తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు.

పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో ఆయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అయితే లిక్కర్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్న సమయంలో పలుసార్లు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జగన్ కోటరీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని కూడా ప్రకటించారు. 

ఈ క్రమంలో ఆయన సడెన్ గా.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పక్షపాతం లేకుండా, నిజాయితీతో వార్తలను అందించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. సాధారణ ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ప్లాట్‌ఫాం లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కంటెంట్ రూపొందించనున్నట్లు తెలిపారు.

మరోవైపు ఈ మీడియా వేదిక ఎలాంటి రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకుండా స్వతంత్రంగా కొనసాగుతుందని విజయసాయి స్పష్టం చేశారు. నిష్పక్షపాత ధోరణితో వార్తలను అందించడమే లక్ష్యమని వెల్లడించారు.

భవిష్యత్‌లో శాటిలైట్ ఛానల్ ను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాట్‌ఫాం పేరును త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంటూ, తదుపరి వివరాల కోసం వేచి చూడాలని కోరారు.

విజయ సాయి వైసీపీలో ఉన్నప్పుడే ఒక కొత్త మీడియా వేదికను మొదలు పెడతారనే వార్తలు వినిపించాయి. కొత్త మీడియా ఛానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు 2022లోనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన సొంత మీడియా పెడతారా లేదా, లేక వైయస్సార్‌సీపీ తరపున వేరే ఛానెల్ బాధ్యతలు తీసుకుంటున్నారా అనే చర్చ అప్పట్లో జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలలో విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు మూడేళ్ల ముందుగా సొంత ఛానల్ ను స్టార్ట్ చేస్తానని చెప్పడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.

Kumar

Recent Posts

పాతికేళ్ల సినిమాకి సీక్వెల్ అవసరమా

ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…

1 hour ago

జగన్ సభకు అనుమతి ఎందుకు లేదు పవన్: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. ఈ నెల 2న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన తెలంగాణ న‌వ‌నిర్మాణ సంక‌ల్ప స‌భ‌కు పోలీసులు అనుమ‌తి…

2 hours ago

సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…

3 hours ago

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

4 hours ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

4 hours ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

6 hours ago