Political News

గ్రౌండ్ రిపోర్ట్: చంద్రబాబు జోక్యం తప్పదు!

పైకి అంతా బాగుంద‌ని చెప్పడానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషించడానికి చాలా తేడా ఉంటుంది. పైకి మెచ్చుకోళ్లకు, మెప్పులకు ప్రభుత్వ పెద్దలు ఒగ్గిపోతే ఎవరు ఏమీ చేయలేరు. కానీ వాస్తవాలను చెప్పే క్రమంలో వస్తున్న విమర్శలను పట్టించుకోకపోతే మాత్రం పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీవ్రంగా గాడి తప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇది వైసీపీ నాయకులు గానీ, జగన్ గానీ చెబుతున్న విషయం కాదు. వారు చెప్పాలనుకున్నా కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగితే అది తమకు అనుకూలమవుతుందనే భావన ఉంది. అయితే వాస్తవాలు చిన్న చిన్న సోషల్ మీడియా వేదికల ద్వారా బయటకు వస్తున్నాయి. పోలీసులు చేస్తున్న కొన్ని చర్యలు ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రతిష్టకూ దెబ్బతీస్తున్నాయి.

గత వారం జరిగిన మూడు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వీటిపై గంభీరంగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.

రైల్వే కోడూరులో ఒక పార్టీ నాయకుడు, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ చేతిలోని లాఠీని లాక్కొని, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన మహిళను నడిరోడ్డుపై కొట్టాడు. ఆ సమయంలో ఎస్సై చూస్తూ ఉండిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలీసుల లాఠీతో దాడి జరగడం పెద్ద వివాదంగా మారింది.

పల్నాడు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నారు. యువతి తండ్రికి ఈ వివాహం నచ్చకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి, యువతి తండ్రి నుంచి సుమారు 2 లక్షల రూపాయలు తీసుకుని, యువతిని బలవంతంగా అతనికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు రాత్రి ఆమెను హత్య చేసిన ఘటన
కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు నమోదైంది.

ఆకివీడులో దళిత వర్గం మరియు ఉపసభాపతి మధ్య జరిగిన వివాదంలో, పోలీసులు హద్దులు మీరినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఘటన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోకపోవడంతో పాటు, తర్వాత సంబంధం లేని వారిపై కేసులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ మూడు ఘటనలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇలాంటి అంశాలపై చంద్రబాబు తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇవే ఘటనలు మరింత పెద్ద వివాదాలకు, వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

14 minutes ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

18 minutes ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

33 minutes ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

1 hour ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

2 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

3 hours ago