పైకి అంతా బాగుందని చెప్పడానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషించడానికి చాలా తేడా ఉంటుంది. పైకి మెచ్చుకోళ్లకు, మెప్పులకు ప్రభుత్వ పెద్దలు ఒగ్గిపోతే ఎవరు ఏమీ చేయలేరు. కానీ వాస్తవాలను చెప్పే క్రమంలో వస్తున్న విమర్శలను పట్టించుకోకపోతే మాత్రం పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీవ్రంగా గాడి తప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇది వైసీపీ నాయకులు గానీ, జగన్ గానీ చెబుతున్న విషయం కాదు. వారు చెప్పాలనుకున్నా కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగితే అది తమకు అనుకూలమవుతుందనే భావన ఉంది. అయితే వాస్తవాలు చిన్న చిన్న సోషల్ మీడియా వేదికల ద్వారా బయటకు వస్తున్నాయి. పోలీసులు చేస్తున్న కొన్ని చర్యలు ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రతిష్టకూ దెబ్బతీస్తున్నాయి.
గత వారం జరిగిన మూడు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వీటిపై గంభీరంగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.
రైల్వే కోడూరులో ఒక పార్టీ నాయకుడు, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ చేతిలోని లాఠీని లాక్కొని, ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసిన మహిళను నడిరోడ్డుపై కొట్టాడు. ఆ సమయంలో ఎస్సై చూస్తూ ఉండిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలీసుల లాఠీతో దాడి జరగడం పెద్ద వివాదంగా మారింది.
పల్నాడు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నారు. యువతి తండ్రికి ఈ వివాహం నచ్చకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, యువతి తండ్రి నుంచి సుమారు 2 లక్షల రూపాయలు తీసుకుని, యువతిని బలవంతంగా అతనికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు రాత్రి ఆమెను హత్య చేసిన ఘటన
కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు నమోదైంది.
ఆకివీడులో దళిత వర్గం మరియు ఉపసభాపతి మధ్య జరిగిన వివాదంలో, పోలీసులు హద్దులు మీరినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఘటన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోకపోవడంతో పాటు, తర్వాత సంబంధం లేని వారిపై కేసులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ మూడు ఘటనలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇలాంటి అంశాలపై చంద్రబాబు తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇవే ఘటనలు మరింత పెద్ద వివాదాలకు, వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది.
This post was last modified on April 9, 2026 11:33 am
రేపు విడుదల కాబోతున్న డెకాయిట్ మీద ట్రేడ్ వర్గాలే కాదు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుక్ మై…
మన శంకరవరప్రసాద్ గారుతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయకుండా వేగానికి ప్రాధాన్యం ఇస్తూనే క్వాలిటీ మిస్ కాకుండా చూసుకోవడంలో మలయాళ…
టీడీపీకి కార్యకర్తలే వెన్నెముకని.. తరచుగా పార్టీఅధినేత సీఎం చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ పార్టీ జాతీయ ప్రధాన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా దానికి ఓ రీజనింగ్ ఉంటుంది. ఇక…
ప్రస్తుతం టాలీవుడ్లో ప్రామిసింగ్ యంగ్ యాక్టర్లలో అడివి శేష్ ఒకడు. తనకంటూ హీరోగా ఒక స్థాయి ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్,…