Political News

క్యాసెట్ అరగట్లేదా జగన్?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత జ‌గ‌న్ పాత పాటే పాడారు. చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తాన‌ని వ్యాఖ్యానించారు. తాను వ‌చ్చే ఏడాది పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని.. అప్పుడు ప్ర‌తిరోజూ ఆయ‌న‌కు చుక్క‌లు క‌నిపించేలా చేస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంలో వైసీపీ శ్రేణులు నిరాశ‌చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. తాజాగా బుధ‌వారం ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. పార్టీ ప‌రంగా ఎలా ముందుకు సాగాల‌న్న విష‌యంపై వారితో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎప్పుడో ఎక్క‌డో ఎవ‌రో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌ని.. వారిపై ఇప్ప‌టికీ కేసులు పెట్టి కొడుతున్నార‌ని.. జైళ్ల‌కు కూడా త‌ర‌లిస్తున్నార‌ని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా అలానే జ‌రుగుతుంద‌న్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు అంతులేకుండా పోయింద‌న్నారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తున్నా.. వారిపై అఘాయిత్యాలు జ‌రుగుతున్నా.. చంద్ర‌బాబుకు క‌నిపించ‌డం లేద‌న్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

క‌ళ్లుమూసి తెరిచేలోగానే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయ‌ని.. చెప్పిన జ‌గ‌న్‌, మ‌రో రెండున్న‌రేళ్లు మ‌రింత సునాయాసంగా గ‌డిచిపోతాయ‌న్నారు. తాను వ‌చ్చే ఏడాది పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నాన‌ని.. ఏడాదిన్న‌ర‌పాటు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని పేర్కొన్నారు. అప్పుడు నిరంత‌రం.. చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తానని చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై గ‌ళం వినిపిస్తాన‌న్నారు. పార్టీప‌రంగా యుద్ధం చేసేందుకు కేడ‌ర్ సిద్ష‌ధంగా ఉండాల‌ని సూచించారు. ఇప్ప‌టికే పోరాటాలుచేస్తున్నామ‌ని.. కానీ.. ఇది మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మావిగ‌న్ అనేది రెండో ఆప్ష‌న్ అని జ‌గ‌న్ స‌మ‌ర్థించుకున్నారు. మూడు రాజ‌ధానుల‌ను అభివృద్ధి చేయ‌డం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావించామ‌న్నారు. అయితే.. ఇది సాధ్యంకాక‌పోతే.. ఆప్ష‌న్‌-2 కింద మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ను అభివృద్ది చేసుకునేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంద‌న్నారు. దీనిని కూడా చంద్ర‌బాబు.. `జ‌గ‌న్‌` కోణంలో చూస్తున్నాడ‌ని.. అమ‌రావ‌తిని కాదంటే.. త‌న‌కు క‌మీష‌న్లు ద‌క్క‌కుండా పోతాయ‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అమ‌రావ‌తి మ‌రో పాతికేళ్ల‌కు కూడా రెడీ కాద‌న్నారు. అన్ని ల‌క్ష‌ల కోట్లు ఎవ‌రు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు.

జగన్ పదే పదే ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ ఉంటే ప్రయోజనం ఉంటుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. జనాల్లోకి వచ్చి ప్రశ్నించాలి కానీ ఇలా మీడియా ముందు ఎంత మాట్లాడినా అది కొంతవరకే ప్రజల్లోకి వెళుతుందనేది కొందరి వైసీపీ నాయకుల వేదన. మరి జగన్ జనాల్లోకి త్వరగా వస్తారో లేక పాదయాత్ర వరకు వైసీపీ నేతలకు ఈ తిప్పలు తప్పవో వేచి చూడాలి.

This post was last modified on April 9, 2026 8:11 am

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

5 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

5 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

6 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

7 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

9 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

10 hours ago