కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్ నేత, కేరళ సీఎం విజయన్పై విమర్శలు చేయడం.. దానికి ఆయన ప్రతి విమర్శలు చేయడం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు దూసుకువచ్చింది. “నన్ను విజయన్ `డ్యాష్` అన్నారు“ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించే పరిస్థితికి తీసుకువచ్చింది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎన్నికల ప్రచారం ఎక్కడ గాడి తప్పింది? అనేది ఆసక్తికరం.
మొత్తం 7 రోజుల పాటు కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. తొలి రెండు రోజులు ఆయన తన ప్రచారాన్ని ప్రశాంతంగానే ముందకు తీసుకువెళ్లారు. కానీ, అనుకున్న విధంగా తన ప్రచారానికి జోష్ దక్కలేదు. దీంతో రేవంత్ యూటర్న్ తీసుకుని.. తెలంగాణలో తన పాలనను ముడిపెడుతూ.. విజయన్పాలనను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. పథకాలు, పేదరికం, నిరుద్యోగం.. సహా.. నీతిఆయోగ్ నివేదికలు ఇలా.. అనేక అంశాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో విజయన్.. రేవంత్ ను కార్నర్ చేసుకుని తన ప్రచారాన్ని తీవ్రతరం చేశారు.
ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య వ్యక్తిగత అంశాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ విషయంలో రేవంత్ ను… విజయన్ దుర్భాషలాడారని తెలిసింది. దీనికి కారణం.. రేవంత్ రెడ్డి.. విజయన్ను దొంగతో పోల్చడమే.
గతంలో విజయన్పై దుబాయి బంగారం స్మగ్లింగ్ యువతికి సహకరించారన్న ఆరోపణలు వున్నాయి. దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. కానీ, ఈ కేసు ఎటూ తేలలేదు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే రేవంత్ రెడ్డి తాజాగా ఆయనను దొంగగా సంబోధించారు. దీంతో విజయన్ కూడా ఇదేవ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
మరో రెండు రోజుల్లోనే(గురువారం) ఎన్నికలు జరగనున్న కేరళం గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా రోడ్డున పడడం.. `డ్యాష్-డ్యాష్` పదాలను ప్రయోగించడం వంటివి రాజకీయంగా ఏమంత బాగోలేదని పరిశీలకులు చెబుతున్నారు.
మరోవైపు రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన చెబుతున్న లెక్కలను బీఆర్ ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. పరోక్షంగా కేరళకు ఇక్కడి లోపాలను వారు చేరవేస్తున్నారు. సో.. మొత్తంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రు ల మధ్య తీవ్రస్థాయి యుద్ధంలో పైచేయి కంటే కూడా.. రాజకీయం ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
This post was last modified on April 7, 2026 10:23 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…