Political News

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని నియ‌మించిన విష‌యం తెలిసిందే. గ‌త ఆరుమాసాల కింద‌టే ఈ క‌మిటీ నియామ‌క‌మైంది. ఈ క‌మిటీ స‌భ్యులు ఇప్ప‌టి వ‌ర‌కు 4 సార్లు ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై చ‌ర్చించారు. తాజాగా మంగ‌ళ‌వారం మ‌రోసారి భేటీ అయి.. తుది నివేదిక‌ను రూపొందించారు.

2 ప్ర‌తిపాద‌న‌లు..

విశాఖ‌లో నిర్మించిన భారీ ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న అంశంపై మంత్రుల క‌మిటీ రెండు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేసింది. 1) వైసీపీ నిర్మించిన విలాస‌వంత‌మైన ప్యాలెస్‌ను ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నకు ఎగ్జిబిష‌న్‌గా వినియోగించ‌డం. 2) ప్ర‌ముఖ హోట‌ళ్ల యాజ‌మాన్యాలు కోరుతున్న‌ట్టుగా వాటికి లీజుకు ఇవ్వ‌డం. ఈ రెండు ప్ర‌తిపాద‌న‌ల్లో న‌లుగురు మంత్రులు కూడా 1వ ప్ర‌తిపాద‌న‌కే మొగ్గు చూపుతున్నారు. ముగ్గురు మంత్రులు దీనిని ప్ర‌తిపాదించారు. ఒక్క‌రు మాత్ర‌మే ఇత‌ర సంస్థ‌ల‌కు నిర్వ‌హ‌ణ‌కు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. దీనిని సీఎం చంద్ర‌బాబు ముందు ఉంచి.. నిర్ణ‌యం తీసుకుంటారు.

ఆ ప్ర‌తిపాద‌న ఎందుకు?: వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ప్ర‌జాధ‌న దుర్వినియోగాన్ని ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేసేందుకు దీనిని వినియోగించుకోవాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం గ‌తంలో నిర్ణ‌యించింది. అయితే.. కొన్ని అభ్యంత‌రాల‌తోపాటు.. ప్ర‌ధానంగా కూట‌మి మిత్ర ప‌క్షం బీజేపీ ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించింది. దీనిని ఏదైనా లీజుకు ఇస్తే ఆదాయం వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించింది. అయితే.. ఈప్ర‌తిపాద‌న విష‌యంలో కూడా క‌మ‌ల నాథులు విడిపోయారు. కొంద‌రు అలాకాదు.. ఎగ్జిబిష‌న్ చేయాల‌ని కోరారు. దీంతో ప్ర‌భుత్వం క‌మిటీని నియ‌మించింది.

ఏం చేస్తారు?

మంత్రి వ‌ర్గ క‌మిటీ మెజారిటీ నిర్ణ‌యంమేర‌కు రుషి కొండ‌ను. .. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వినియోగించ‌నున్నార‌ని తెలుస్తోంది. త‌ద్వారా వైసీపీ ఎలాంటి ప‌నులు చేసిందో.. ఎంత వృథా చేసిందో వివ‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ద్వారా జ‌గ‌న్ మైండ్ సెట్‌.. ఆయ‌న నిధుల వినియోగం.. చేసిన అప్పులు వంటివి చ‌ర్చ‌కు వ‌స్తాయ‌ని త‌ల‌పోస్తున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు కూడా సానుకూలంగా ఉన్నార‌ని గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విలాస‌వంత‌మైన ఈ భ‌వ‌నాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు పెడ‌తారని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

This post was last modified on April 7, 2026 11:09 pm

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

2 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

4 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

5 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

6 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

7 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

7 hours ago