వైసీపీ అధినేత జగన్ను సమర్థించేవారు.. ఉన్నారా? అంటే.. ఉన్నారు. ఇటు సోషల్ మీడియా వేదికగా.. అటు రాజకీయంగా కూడా ఆయనను .. ఆయన విధానాలను తరచుగా సమర్థించే నాయకులు చాలా మందే ఉన్నారు. ఇక, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ జాబితాలో కొందరు ఉన్నారు. జగన్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. వారు మీడియా ముందుకు రావడమో.. సోషల్ మీడియాలో వీడియోలు చేయడమో.. అందరికీ తెలిసిందే.
మూడు రాజధానుల నుంచి అనేక విషయాల వరకు.. కూడా జగన్ను పలువురు సమర్థిస్తున్న వ్యవహారం.. వారు చేస్తున్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. జగన్ తరఫున రాజకీయ నేతల కంటే కూడా ఎక్కువగా కొందరు జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. అయితే.. తాజా పరిణామాల క్రమంలో వారు సైతం జగన్ వ్యవహారాన్ని సమర్థించలేక.. మౌనంగా ఉండిపోవడం గమనార్హం. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కూటమి దూకుడు తెలిసిందే.
అయితే.. ఇదేసమయంలో జగన్.. మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులతో కూడిన రాజధాని) ఫార్ములాను తెరమీదికి తెచ్చారు. ఈ మూడు ప్రాంతాలను తీసుకుని కూడా డెవలప్ చేసుకునేందుకు అవకాశం ఉందని.. లక్షల కోట్ల రూపాయలతో అమరావతిని ఎప్పటికి అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. కానీ.. ప్రజలు మాత్రం అమరావతికి అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని.. అమరావతి రైతులు త్యాగాలు చేశారన్న విషయాన్ని జగన్ మరిచిపోతున్నారు. ఉద్దేశపూర్వంగానే విస్మరిస్తున్నారు.
మరీ ముఖ్యంగా.. ఒక ఇంటిని నిర్మించేప్పుడే.. అనేక ప్రణాళికలతో మొదలు పెడతారు. దానిని పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. ముందు అనుకున్న ప్రణాళికలతోనే రంగంలోకి దిగినా.. కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలతో అనేక మార్పులు జరుగుతాయి. ఈ విషయంలో అమరావతి కూడా అంతే!. సుదీర్ఘ ప్రణాళికలను.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే.. విస్తరణ ప్రణాళిక ఎక్కువగానే ఉంది. దీనిని కూడా జగన్ విస్మరిస్తున్నారు.
మూడు రాజధానులను కాదని.. మావిగన్ను తెరమీదికి తెచ్చారు. అయితే.. జగన్ ప్రతిపాదనలను సొంత పార్టీ నాయకులతో పాటు.. ఆయనను సమర్థించే సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు కూడా సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. అయితే.. అమరావతికి లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తెస్తారన్న ప్రశ్న మాత్రమే వారు సంధిస్తున్నారు. సహజంగా అభివృద్ధి చెందే క్రమంలో తొలిదశ అమరావతి పూర్తయితే.. దాని సొమ్ములను అదేసంపాయించుకుంటుందన్న చర్చ కూటమి నుంచి వస్తుండడంతో జగన్ అనుకూల మీడియా సహా.. ఇతర వర్గాలు సైలెంట్ కావడం గమనార్హం.
This post was last modified on April 3, 2026 9:40 pm
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…